
Published : 12 Feb 2021 00:40 IST
21% తగ్గిన కోల్ ఇండియా లాభం
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కోల్ ఇండియా ఏకీకృత ప్రాతిపదికన రూ.3085.39 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.3,923.87 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 21 శాతం తక్కువ. మొత్తం ఆదాయం సైతం రూ.24,602.19 కోట్ల నుంచి రూ.24,334.62 కోట్లకు తగ్గింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ ఉత్పత్తి 156.78 మిలియన్ టన్నులకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఉత్పత్తి 147.50 మి.టన్నులుగా నమోదైంది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా వాటా 80 శాతం కంటే ఎక్కువగా ఉంది.
Tags :