టీకాలపై మూడురోజుల్లో నిర్ణయం..!

దేశంలో కొవిడ్‌ కేసులు తీవ్రత పెరిగిపోవడంతో విదేశీ టీకాలకు అనుమతుల విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది.

Published : 15 Apr 2021 15:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కొవిడ్‌ కేసులు తీవ్రత పెరిగిపోవడంతో విదేశీ టీకాలకు అనుమతుల విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. దీంతో అమెరికా ఎఫ్‌డీఐ,ఐరోపా సంఘంలోని ఈఎంఏ, యూకేలోని ఎంహెచ్‌ఆర్‌ఏ, జపాన్‌ పీఎండీఏ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో అనుమతులు పొందిన టీకాలు భారత్‌లో అడుగుపెట్టడం మరింత సులభంగా మారింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను నేడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) ఒక ప్రకటనలో వెల్లడించింది.  

‘నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌’ సిఫార్సు మేరకు టీకాల అత్యవసర అనుమతులను వేగవంతంగా పరిశీలించేందుకు అవసరమైన మార్గదర్శకాలను డీసీజీఐ నేతృత్వంలోని ‘ది సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌’ తయారు చేసి వెబ్‌సైట్‌లో ఉంచనుంది.  ఆయా విదేశీ టీకా సంస్థలు భారత అనుబంధ సంస్థలు లేదా స్థానికంగా గుర్తింపు పొందిన ఏజెంట్‌ ద్వారా సీడీఎస్‌సీవోకు దరఖాస్తు చేసుకోవాలి. పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి పనికి వస్తుందేమో సీడీఎస్‌సీవో పరిశీలించి 3 రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడించాలి. దాని ఆధారంగా ఆ తర్వాత డీసీజీఐ అనుమతులు మంజూరు చేస్తుంది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని