కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11 శాతం డీఏ పెంపు
ఉద్యోగులకు డీఏ 17 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (డిఎ), డియర్నెస్ రిలీఫ్ (డిఆర్) ను ప్రస్తుత రేటు నుంచి 11 శాతం పెంచిది, దీంతో గతంలో 17 శాతం ఉండగా ఇప్పుడు 28 శాతానికి పెరిగింది. ఇది జులై 1, 2021 నుంచి అమల్లోకి రానుంది. కరోనా సంక్షోభం కారణంగా జనవరి 1, 2020, జూలై 1, 2020, జనవరి 1, 2021 పెంపులను ప్రభుత్వం నిలిపివేసింది.
ప్రభుత్వం వెల్లడించిన ముఖ్య విషయాలు:
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అంతకుముందు 17 శాతం ఉండగా జులై 1, 2020 నుంచి 28 శాతం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
* ఈ పెరుగుదల 1 జనవరి, 2020, 1 జూలై 2021, 1 జనవరి 2021 వరకు అన్ని వాయిదాలను కలిపి ఒకేసారి పెంచింది.
* జనవరి 2020 నుంచి జూన్ 30, 2021 వరకు డీఏ లేదా డీఆర్ 17 శాతంగానే ఉంటుంది.
* డీఏ, డీఆర్ల పెంపుతో ప్రభుత్వ ఖజానాపై రూ.34,401 కోట్లు అదనపు వార్షిక భారం పడుతుందని తెలిపింది.
* ఈ పెంపుతో 48.34 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారని పేర్కొంది.
కోవిడ్ -19 సంక్షోభం కారణంగా జూలై 2021 వరకు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్లకు ప్రియమైన భత్యం డీఏ, డీఆర్ పెంపును తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ 2020 ఏప్రిల్లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పెంపు ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తను అందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్