రాబడి తగ్గకుండా ఉండాలంటే ఈ మూడు అంశాలపై దృష్టిపెట్టండి
రుణ చెల్లింపులు ఎక్కువ కాలం చేస్తే వడ్డీపై చక్రవడ్డీ పెరుగుతుంది. దీంతో ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది
పెట్టుబడులపై వచ్చే ఆదాయంపై చక్రవడ్డీ ద్వారా వచ్చే రాబడి గురించి తెలిసే ఉంటుంది. మరి కొన్ని సార్లు అదే చక్రవడ్డీ మనం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సంపాదించిన డబ్బు ఆవిరైపోతుంది. మరి ఎటువంటి సందర్భాల్లో మనం తిరిగి చక్రవడ్డీ రూపంలో చెల్లించాలో తెలుసుకుందాం
రుణాలపై వడ్డీ చెల్లింపులు..
వడ్డీపై చక్రవడ్డీ లభిస్తే రాబడి మరింత పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో, మీరు ఇప్పటికే సంపాదించిన వడ్డీ ఆదాయాన్ని ఎక్కువ రాబడిని సంపాదించడానికి కొనసాగించడం ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే రుణాలపై వడ్డీ చెల్లిస్తున్నప్పుడు ఇదే సూత్రం మీపై ప్రభావం చూపిస్తుంది.
ఈఎమ్ఐ తగ్గించుకునేందుకు ఎక్కువ కాలపరిమితో రుణాలను తీసుకుంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సమయానికి చెల్లింపులు చేయకపోతే, ఆ వడ్డీతో పాటు దానిపై వడ్డీ కూడా వర్తిస్తుంది. క్రెడిట్ కార్డు రుణాలపై లేదా ఈఎమ్ఐ చెల్లించనప్పుడు ఈ విధమైన సమస్యలు ఎదురవుతాయి.
చాలామందికి క్రెడిట్ కార్డు బిల్లు సమయానికి చెల్లించకపోతే ఎక్కువ వడ్డీ పడుతుందని తెలుసు. కానీ ఈఎమ్ఐల విషయానికొస్తే ఎక్కువ కాలం కాలపరిమితితో తక్కువ చెల్లించేందుకే చూస్తారు. ఎక్కువ వడ్డీ పడుతుందన్న విషయం గురించి ఆలోచించరని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీ రేటును బట్టి చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. క్రెడిట్ కార్డులతో రోజువారిగా లెక్కిస్తారు దీంతో ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
పెట్టుబడుల వ్యయాలు..
పెట్టుబడులపై వర్తించే అధిక వ్యయాలు, ఫీజులు, పన్నులు.. వచ్చే రాబడిపై చూపుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల్లో వ్యయాలు పెరిగితే రాబడి తగ్గుతుంది. ఉదాహరణకు పెట్టుబడులపై.. 15 సంవత్సరాలకు 2 శాతం చొప్పున వార్షిక వ్యయం చెల్లిస్తే.. వచ్చే తుది రాబడి 12 శాతం వరకు తగ్గుతుంది. పన్ను మినహాయింపు వర్తించే విధంగా పెట్టుబడులు ఉంటే మరింత ప్రయోజనం చేకూరుతుంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో క్రమానుగతంగా పన్ను చెల్లింపుతో రాబడి తగ్గుతూ వస్తుంది.
ద్రవ్యోల్బణం..
సంపాదించిన డబ్బును ద్రవ్యోల్బణం ఆవిరి చేస్తుంది. ఇప్పుడు వెయ్యి రూపాయలకు ఉన్న విలువ వచ్చే రోజుల్లో ద్రవ్యోల్బణం కారణంగా తగ్గుతుంది. ఇప్పుడు ఒక వెయ్యి రూపాలయతో కొనుగోలు చేయగలిగే ఒక వస్తువు కొన్ని రోజుల తర్వాత కొనుగోలు చేయలేం. ఎందుకంటే ద్రవ్యోల్బణం కారణంగా ధర పెరుగుతుంది. ఒక వస్తువుకు ఇప్పుడు చెల్లించే డబ్బు, 15 ఏళ్ల తర్వాత 5 శాతం ద్రవ్యోల్బణం ఉంటే 107 శాతం ఎక్కువగా చెల్లించాలి. ద్రవ్యోల్బణం అదిగమించే పద్ధతులను పాటిస్తే రాబడిని కాపాడుకోవచ్చు.
చివరగా..
ఆర్థిక విషయాలపై ముఖ్యంగా ప్రభావం చూపించేది సమయం. రుణ చెల్లింపులకు ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే.. అంత ఎక్కువగా కోల్పోతారు. అందుకే స్వల్పకాలిక రుణాలను తీసుకొని సమయానికి చెల్లించండి. ఎక్కువ వడ్డీ భారం పడకుండా ఉండాలంటే ముందస్తు చెల్లింపులను పరిశీలించండి. ద్రవ్యోల్బణాన్ని అదిగమించే పెట్టుబడులను ఎంచుకోండి. పన్నులు, వ్యయాలు తక్కువగా ఉండి, పన్ను మినహాయింపులు లేదా విత్డ్రా సమయంలో మాత్రమే వర్తించే విధంగా పెట్టుబడులు ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె