5జీ ట్రయల్స్కు టెలికాంశాఖ అనుమతి
దేశంలో 5జీ ట్రయల్స్ను టెలికాం మంత్రిత్వశాఖ మంగళవారం అనుమతి ఇచ్చింది.
న్యూదిల్లీ: దేశంలో 5జీ ట్రయల్స్కు టెలికాం మంత్రిత్వశాఖ మంగళవారం అనుమతి ఇచ్చింది. ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఎంటీఎన్లు 5జీ ట్రయల్స్ను ప్రారంభించవచ్చని అయితే, చైనా సంస్థలకు చెందిన ఏ టెక్నాలజీని వాడకూడదని స్పష్టం చేసింది. ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, సీ-డాట్తో పాటు రిలయన్స్ జియో సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ సాయంతో 5జీ ట్రయల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలకు అనుమతి లభించడం విశేషం.
చైనాకు చెందిన హువాయ్ టెక్నాలజీని ఉపయోగించి ట్రయల్ చేస్తామని భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ప్రతిపాదించాయి. ఆ తర్వాత చైనా కంపెనీల టెక్నాలజీ సాయం లేకుండానే ట్రయల్స్ నిర్వహిస్తామని ప్రకటించాయి. ‘ఈ టెలికాం కంపెనీలు అన్నీ ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, సి-డాట్ అభివృద్ధి చేసి టెక్నాలజీ సాయం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఒక్క రిలయన్స్ జియో మాత్రమే సొంతంగా అభివృద్ధి చేసుకున్న టెక్నాలజీని వాడుతోంది. ఆరు నెలల పాటు ఈ ట్రయల్స్ నిర్వహించాలి. సామగ్రి సిద్ధం చేసుకోవడానికి రెండు నెలల సమయం పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా