PF: ఈ ప్రక్రియ పూర్తి చేశారా? లేదంటే పీఎఫ్ జమ కాదు!
మీరు ఉద్యోగులా? మీకు మీ సంస్థ ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్) ప్రయోజనాలు అందజేస్తోందా? అయితే, మీకు ఓ ముఖ్య గమనిక! ఈ నెలాఖరు కల్లా మీరు మీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ‘సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్)ను ఆధార్తో అనుసంధానించాల్సి ఉంటుంది....
ముంబయి: మీరు ఉద్యోగులా? మీకు మీ సంస్థ ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్) ప్రయోజనాలు కల్పిస్తోందా? అయితే, మీకు ఓ ముఖ్య గమనిక! ఈ నెలాఖరు కల్లా మీరు మీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ‘సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్)ను ఆధార్తో అనుసంధానించాల్సి ఉంటుంది. లేదంటే.. ‘ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ఈసీఆర్)’ భర్తీ కాదు. అంటే మీ పీఎఫ్ ఖాతాల్లో వచ్చే నెల నుంచి కంపెనీ వాటా జమ కాదు. వెంటనే ఉద్యోగుల యూఏఎన్ను ఆధార్తో అనుసంధానించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) యాజమాన్యాలకు సైతం తెలియజేసింది. ఇంతకు ముందు యూఏఎన్-ఆధార్ అనుసంధానానికి 31 ఆగస్టు 2021 తుది గడువుగా విధించారు. అనంతరం దాన్ని 2021 నవంబరు 30 వరకు పొడిగించారు.
ఆధార్ అనుసంధానం జరగకపోతే.. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే కొవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వం అందించే ప్రయోజనాలకు కూడా దూరమవుతారు. బీమా ప్రయోజనాలు సైతం అందవు.
ఈపీఎఫ్ - ఆధార్ లింక్ ఆన్లైన్ ఎలా చేయాలంటే..
✦ ఈపీఎఫ్ఓ పోర్టల్ను తెరిచి, ఎడమ వైపు ఉన్న ఈకేవైసీ ఆప్షన్ను క్లిక్ చేయండి.
✦ ఇక్కడ యూఏఎన్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి.
✦ జనరేట్ ‘ఓటీపీ’ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
✦ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు వచ్చిన ‘ఓటీపీ’ని ఎంటర్ చేసి, జండర్(లింగం)ని సెలక్ట్ చేసుకోవాలి.
✦ ఇక్కడ ఆధార్ నంబరును ఎంటర్ చేసి ‘ఆధార్ వెరిఫికేషన్’ను ఎంపిక చేసుకోవాలి.
✦ ప్రస్తుతం ఉపయయోగిస్తున్న ‘మొబైల్ లేదా ఈ-మెయిల్’ ద్వారా వెరిఫికేషన్ పూర్తిచేయొచ్చు.
✦ వెరిఫికేషన్ కోసం మరోసారి ‘ఓటీపీ’ వస్తుంది.
✦ ‘ఓటీపీ’ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
✦ దీంతో ఈపీఎఫ్, యూఏఎన్ ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం