ఈపీఎఫ్ కోసం రెండు ఖాతాలు
ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) విధానంలో మరో మార్పు చోటు చోసుకోనుంది. చందాదారులు ఇక నుంచి రెండు ఖాతాలు నిర్వహించవలసి ఉంటుంది......
ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) విధానంలో మరో మార్పు చోటు చోసుకోనుంది. చందాదారులు ఇక నుంచి రెండు ఖాతాలు నిర్వహించవలసి ఉంటుంది. వార్షిక వడ్డీని నిర్వహించేందుకు ఒక ఖాతా, ఈక్విటీ (ఈటీఎఫ్) పెట్టుబడులలో ద్వారా వచ్చిన యూనిట్లను లెక్కించేందుకు మరో ఖాతాను నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతేడాది కేంద్ర ధర్మకర్తల మండలి (సీబీటీ) పీఎఫ్ చందారుల పెట్టుబడులను నగదు బదులుగా ఈటీఎఫ్లలో లెక్కించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే దీని ప్రకారం ఈపీఎఫ్ఓ ప్రత్యేకంగా రెండు ఖాతాలను నిర్వహించే అవకాశముంది.
ఆగస్ట్ 2015 నుంచి ఈపీఎఫ్ఓ ఈక్విటీలలో పెట్టుబడులను ప్రారంభించింది. 2015-16 లో ఈ పరిమితి 5 శాతంగా ఉండగా, 2016-17 లో 10 శాతానికి, 2017-18 లో 15 శాతానికి పెరిగింది. అయిదు కోట్ల మందికి పైగా చందాదారులకు మేలు చేసే ఉద్యోగ భవిష్య నిధి (పీఎఫ్) పెట్టుబడుల విధానంలో, ఈపీఎఫ్ఓ త్వరలో మార్పులు తీసుకురానుంది. ఈపీఎఫ్ఓలో కచ్చితమైన పరిమితి అనేది లేకుండా వారికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాన్ని కల్పించనుంది. ప్రస్తుతం పీఎఫ్ చందాదారులు కచ్చితంగా 15 శాతం మార్కెట్లలో పెట్టుబడులు చేయాలన్న సంగతి తెలిసిందే.
అయితే చందాదారులు ఇప్పుడు ఈక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్) ద్వారా పెట్టుబడులు పెంచుకునే, తగ్గించుకునే అవకాశాన్ని త్వరలో కల్పించబోతున్నట్లు వెల్లడించింది. ఈపీఎఫ్ఓ సలహాదారు ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్, ఆడిట్ కమిటీ సిఫార్సుల తర్వాత కేంద్ర కార్యకర్తల మండలి (సీబీటీ) ఈ నిర్ణయం తీసుకుంది.
సిరిలో ఇంకా
మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..