Excise collection: ఎక్సైజ్ సుంకం ఆదాయంలో 33 శాతం వృద్ధి
పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చే వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 33 శాతం పెరిగాయి....
కొవిడ్ మునుపటితో పోలిస్తే 79 శాతం అధికం
దిల్లీ: దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో వాహనాలను బయటకి తీయాలంటేనే భయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య విడుదలైన కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ నివేదిక కీలక విషయాలను బయటపెట్టింది. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చే వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 33 శాతం పెరిగినట్లు తేలింది. కొవిడ్ మునుపటితో పోలిస్తే 79 శాతం ఎగబాకడం విశేషం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వద్ద ఉన్న ఏప్రిల్-సెప్టెంబరు గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
క్రితం ఏడాది తొలి అర్ధభాగంలో రూ.1.28 లక్షల కోట్లుగా ఉన్న ఎక్సైజ్ సుంకం వసూళ్లు.. ఈసారి రూ.1.71 లక్షల కోట్లకు ఎగబాకాయి. కరోనా వెలుగులోకి రావడానికి ముందు 2019, ఏప్రిల్-సెప్టెంబరు మధ్య ఇవి రూ.95,930 కోట్లుగా ఉన్నాయి. అప్పటితో పోలిస్తే 79 శాతం పెరుగుదల నమోదైంది. ఎక్సైజ్ సుంకం భారీగా పెరగడమే ఇందుకు కారణం. ఎక్సైజ్ సుంకం ద్వారా 2020-21లో రూ.3.89 లక్షల కోట్లు, 2019-20లో రూ.2.39 లక్షల కోట్లు వసూలయ్యాయి.
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, సహజవాయువు పైన మాత్రమే ఎక్సైజ్ సుంకం విధిస్తున్నారు. క్రితం ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో అదనంగా రూ.42,931 కోట్లు వసూలయ్యాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ ఏడాది మొత్తంలో ఆయిల్బాండ్లకు చెల్లించాల్సిన రూ.10,000 కోట్లతో పోలిస్తే ఇది నాలుగింతలు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండడంతో ఇంధన గిరాకీ పెరుగుతోంది. దీంతో పెట్రోల్, డీజిల్పై విధించే ఎక్సైజ్ సుంకం ద్వారా వస్తున్న ఆదాయం సైతం అదే స్థాయిలో పెరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు