జనవరి 1 నుంచి "ఫాస్ట్ ట్యాగ్" తప్పనిసరి...
అనేక బ్యాంకులు ఫాస్ట్ ట్యాగ్ లను నేరుగా, ఆన్లైన్ ద్వారా వాహన వినియోగదారులకు అందిస్తున్నాయి
జనవరి 1, 2021 నుంచి దేశంలోని అన్ని వాహనాలకు (ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు మినహా) ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ పరికరం "ఫాస్ట్ ట్యాగ్" తప్పనిసరి అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం స్పష్టం చేశారు. ఫాస్ట్ ట్యాగ్ను ఉపయోగించడం ద్వారా ప్రయాణికులు తమ సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చునని, అలాగే నగదు చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదని గడ్కరీ తెలిపారు.
ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను వేగంగా స్వీకరించడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నంలో భాగంగా జనవరి 1, 2021 నుంచి నాలుగు చక్రాల వాహనాలలో ఫాస్ట్ ట్యాగ్లు తప్పనిసరి అని రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతకుముందు, డిసెంబర్ 2017 నుంచి దేశంలో విక్రయించే నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఫాస్ట్ ట్యాగ్ ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అదేవిధంగా ఏప్రిల్ 1, 2021 నుంచి కొత్త థర్డ్ పార్టీ వాహన బీమా పొందటానికి ఫాస్ట్ ట్యాగ్ వినియోగాన్ని రవాణా మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది.
అనేక బ్యాంకులు ఫాస్ట్ ట్యాగ్ లను నేరుగా, ఆన్లైన్ ద్వారా వాహన వినియోగదారులకు అందిస్తున్నాయని, ఫాస్ట్ ట్యాగ్ లను పొందిన వారు చాలా సులభంగా తమ వాహనాలకు వాటిని అంటించుకోవచ్చునని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
మొదటిసారిగా ఫాస్ట్ ట్యాగ్ ను 2016 సంవత్సరంలో ప్రారంభించారు. ఆ సమయంలో నాలుగు బ్యాంకులు కలిసి దాదాపు లక్ష ఫాస్ట్ ట్యాగ్ లను జారీ చేశాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2017 నాటికి ఈ సంఖ్య ఏడు లక్షలకు, అలాగే 2018 నాటికి 34 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం, ఫాస్ట్ ట్యాగ్ మొత్తం టోల్ సేకరణలో దాదాపు మూడింట నాలుగవ వంతుగా ఉంది. అలాగే మొత్తం టోల్ వసూలు రోజుకు రూ. 92 కోట్లకు పెరిగింది, సంవత్సరం క్రితం ఇది రోజుకు రూ. 70 కోట్లుగా ఉండేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు