ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకోవచ్చా?
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో ఎండోమెంట్ + హోల్ లైఫ్ బీమా కలిపి ఉంటాయి.
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ లేదా ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ఏదైనా సరే అందులో ఆనందం అనేది కేవలం బీమా ఏజెంట్కే సొంతం తీసుకున్నవారికి కాదు. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో ఎండోమెంట్ + హోల్ లైఫ్ బీమా కలిపి ఉంటాయి. చాలా మందికి బీమా పాలసీల్లో ఉన్న కిటుకుల గురించి అంతగా తెలీదు. అందుకే జీవన్ ఆనంద్ పాలసీ గురించి పూర్తి వివరణ ఈ కథనంలో తెలుసుకుందాం. జీవన్ ఆనంద్ పాలసీ ఎంచుకుంటే టర్మ్ ముగిసిన తర్వాత హామీతో పాటు బోనస్ అందుతుంది అదేవిధంగా పాలసీదారుడు మరణించినప్పుడు నామినీకి హామీ లభిస్తుంది.
జీవన్ ఆనంద్ పాలసీ:
ఈ పాలసీలో బీమా హామీతో పాటు బోనస్ను కూడా టర్మ్ ముగిసినప్పుడు అందజేస్తారు. ఇవి ఎండోమెంట్ పాలసీ కిందకి వస్తాయి. ఈ పేమెంట్ తర్వాత కూడా పాలసీ కొనసాగుతుంది. పాలసీదారుడు మరణించిన తర్వాత జీవిత బీమా పాలసీ కింద హామీ నామినీకి చెల్లిస్తారు.
పాలసీ వివరాలు:
-
కనీస వయసు- 18 సంవత్సరాలు
-
గరిష్ఠ వయసు - 50 సంవత్సరాలు
-
మెచ్యూరిటీ వయసు గరిష్ఠంగా -75 సంవత్సరాలు
-
కనిస్ఠ టర్మ్ పాలసీ - 15 సంవత్సరాలు
-
గరిష్ఠ టర్మ్ పాలసీ - 35 సంవత్సరాలు
-
కనీస హామి లక్ష రూపాయలు, గరిష్ఠంగా పరిమితి లేదు
ఉదాహరణకు:
ఒక వ్యక్తి ఏప్రిల్ 15, 2011 న పాలసీ తీసుకున్నాడు
పాలసీ తీసుకున్నప్పుడు వయసు 30 సంవత్సరాలు
బీమా హామీ మొత్తం రూ.10 లక్షలు
పాలసీ టర్మ్ 25 సంవత్సరాలు, ప్రీమియం చెల్లింపు కాలం 25 సంవత్సరాలు, వార్షిక ప్రీమియం రూ.41,206, మెచ్యూరిటీ తేది ఏప్రిల్ 15, 2036
చెల్లించే మొత్తం బీమా హమీ రూ.10 లక్షలు + 25 సంవత్సరాల బోనస్.
ఎంత మొత్తం లభిస్తుంది?
ఎంపిక చేసుకున్న గడువు ముగిశాక హామీ మొత్తం, బోనస్ కలిపి ఎల్ఐసీ పాలసీదారుడికి అందిస్తుంది. తాజాగా వెయ్యి రూపాయల హామీపై బోన్సర్ రేటును రూ.42 గా ప్రకటించింది. అంటే 2036 నాటికి రూ.10 లక్షల పాలసీకి రూ.42 వేల బోనస్ లభిస్తుంది. బోనస్ కచ్చితంగా చెప్పలేం అది సంస్థ నిర్ణయిస్తుంది. ఇదే రేటు మరో 25 ఏళ్లు కొనసాగితే చెల్లించాల్సిన మొత్తం రూ.10.5 లక్షలు (రూ.42 వేలు. 25 సంవత్సరాలు = రూ.10.5 లక్షలు) అంటే మొత్తం రూ.20.5 లక్షలు వస్తాయి. 2036 లో లభించే మొత్తం హామీ మొత్తం రూ.10 లక్షలు + బోనస్ రూ.10.5 లక్షలు .
2036 తర్వాత ఏం జరుగుతుంది?
పాలసీ చివరి ప్రీమియం 2035 లో చెల్లించవలసి ఉంటుంది. రిస్క్ కవర్ ఎలాంటి ప్రీమియం చెల్లించకపోయానా కొనసాగుతుంది. రూ.10 లక్షలు పాలసీ దారుడి మరణం తర్వాత నామినీకి చెల్లిస్తారు. అందుకే ఇది ఎండోమెంట్+ జీవిత బీమా పథకం
2036 కంటే ముందే పాలసీదారుడు మరణిస్తే?
లాంటి కేసుల్లో నామినికి రూ.10 లక్షల హామీ, అప్పటివరకు వచ్చిన బోనస్ను అందిస్తారు. ఆ ఆర్వాత ఇంకా ఎలాంటి చెల్లింపులు ఉండవు. ఎల్ఐసీ ఎండోమెంట్ పాలసీకి కొనసాగింపుగా ఈ పాలసీని తీసుకొచ్చారు. అదే ఎండోమెంట్ పాలసీలో అయితే ఆ వ్యక్తి ప్రీమియం రూ.37,819 చెల్లించాల్సి ఉంటుంది. అంటే జీవన్ ఆనంద్తో పోలిస్తే రూ.3,387 తక్కువగా ఉంటుంది. కానీ వ్యక్తి మరణించిన తర్వాత ఎలాంటి హామీ ఉండదు.
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ రాబడి:
బోనస్ రేట్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బోనస్ రేట్లతో ఎల్ఐసీ జీవన్ ఆనంద్పై 4.5-5 శాతం రాబడి వస్తుంది.
టర్మ్ బీమా పాలసీ, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు:
కోటి రూపాయల జీవిత బీమా పాలసీ కొనుగోలు చేసిన తర్వాత అంతే మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు చేస్తే ప్రయోజనం ఎంత ఉంటుందో చూద్దాం. రైడర్స్ మినహాయించి టర్మ్ బీమా పాలసీకి రూ.8,500 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
జీవన్ ఆనంద్ పాలసీలో చెల్లించాల్సిన ప్రీమియం రూ.41,206
టర్మ్ బీమా పాలసీ ప్రీమియం రూ.8,500 (వయసు 30, కోటీ రూపాయల కవరేజ్, టర్మ్ 30 సంవత్సరాలు)
అంటే జీవన్ ఆనంద్లో కాకుండా కోటి రూపాయల బీమా పాలసీకి ప్రీమియం చెల్లిస్తే మిగిలేది రూ.41,206 - రూ.8,500 = రూ.32,706
ఈ రూ.32,706 మ్యూచువల్ ఫండ్లలో వచ్చే 25 ఏళ్లకుగాను పెట్టుబడులు పెడితే మెచ్యూరిటీ సమయానికి రూ.32.5 లక్షలకు చేరుతుంది ( వృద్ధి రేటు 10 శాతంగా లెక్కిస్తే) అదే 12 శాతం అయితే ఈ మొత్తం రూ.43.5 లక్షలకు చేరుతుంది. అంటే మ్యూచువల్ ఫండ్లతో వచ్చిన రాబడి జీవన్ ఆనంద్లో వచ్చిన దానికంటే 12 లక్షలు అధికంగా ఉంటుంది.
జీవన్ ఆనంద్పై సమీక్ష:
మీరు సాంప్రదాయ పెట్టుబడులపై నమ్మకం ఉన్నవారైతే ఈ పాలసీని ఎంచుకోవడం మంచిది. అయితే మీ మీద ఆర్థికంగా ఎవరూ ఆధారపడి లేకపోతే పదవీ విరమణ తర్వాత బీమా కవర్తో అవసరం లేదు. కావాలనుకుంటే టర్మ్ పాలసీ తీసుకొని, మ్యూ చువల్ ఫండ్లలో పెట్టుబడులు చేయడం మంచిది
జీవన్ ఆనంద్ పాలసీని సరెండర్ చేయవచ్చా?
ఇప్పటికే మీకు జీవన్ ఆనంద్ పాలసీ ఉంటే దానిని సరెండర్ చేయాలా లేదా కొనసాగించాలా అన్న సందేహం రావొచ్చు. అయితే పాలసీ మద్యలో సరెండర్ చేస్తే క్యాపిటల్ కోల్పోతారు అదేవిధంగా మ్యూచువల్ఫండ్ రాబడిపై కూడా కచ్చితంగా అంచనా వేయలేం.
అయితే సరెండర్ చేయాలనుకుంటే పాలసీ గడువు ఎంత ఉందో చూసుకోవాలి. ఒకవేళ 15 సంవత్సరాల టర్మ్ అనుకుంటే, ఇప్పటికే 9 సంవత్సరాలకు ప్రీమియం చెల్లించారనుకుందాం. అప్పుడు ఇంక సరెండర్ చేయడంలో అర్థం లేదు. అదే గడువు 35 సంవత్సరాలు ఉంటే 9 సంవత్సరాలకు ప్రీమియం చెల్లిస్తే పాలసీ సరెండర్ చేయడమే మంచిది. సులభంగా చెప్పాలంటే ప్రీమియం చెల్లింపు గడువు ఎక్కుగా ఉంటే సరెండర్ చేయడం మంచిది. ఆ తర్వాత వచ్చిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో లేదా పీపీఎఫ్లో పెట్టుబడులు చేస్తే ప్రయోజనం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM