కార్పొరేట్ ఎఫ్డీలలో పెట్టుబడులు పెడుతున్నారా?
కొత్తగా పెట్టుబడులను ప్రారంభించే వారికి చాలా మంది ఇచ్చే సలహా తమ పెట్టుబడులలో కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో చేయాలని. ఒక నిర్ధేశిత కాలానికి, అంతకుముందే నిర్ధేశించిన వడ్డీ రేటు గల ఆర్థిక సాధనాలే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు....
కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టేముందు అందులోని మంచి, చెడుల గురించి తెలుసుకుందాం
కొత్తగా పెట్టుబడులను ప్రారంభించే వారికి చాలా మంది ఇచ్చే సలహా తమ పెట్టుబడులలో కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో చేయాలని. ఒక నిర్ధేశిత కాలానికి, అంతకుముందే నిర్ధేశించిన వడ్డీ రేటు గల ఆర్థిక సాధనాలే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు. ఇందులో తక్కువ వడ్డీ లభిస్తున్నప్పటికీ ప్రజలలో చాలా మంది దీనినే ఎంచుకోవడానికి ముఖ్య కారణం, బ్యాంకుల్లో తమ డబ్బులకు భద్రత ఉంటుంది కాబట్టి. అయితే కేవలం బ్యాంకు ఫిక్సడ్ డిపాజిట్లే కాకుండా, మదుపరులు కార్పోరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లనూ ఎంచుకుని మదుపు చేయడం ప్రారంభించవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి వాటి లాభాలు, నష్టాల గురించి తెలుసుకోవడం మంచిది.
కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే:
కంపెనీలు తమ వ్యాపార నిర్వహణ, విస్తరణ కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరిస్తుంటాయి. అయితే ఇవే కంపెనీలు ఆర్బీఐ నిబంధనలకనుగుణంగా ప్రజల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో నిధులను సమీకరించడాన్నే కార్పోరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు అంటారు. వీటిపై బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లను కంపెనీలు ఇస్తాయి. ఒక వేళ ఈ డిపాజిట్ల కాలపరిమితి అధికంగా ఉంటే దీర్ఘకాల అవసరాల కోసం కంపెనీలు మరింత వడ్డీని ఇస్తాయి.
కంపెనీల క్రెడిట్ రేటింగ్ పై దృష్టి పెట్టండి:
అధిక వడ్డీ రేట్లు ఇస్తున్నాయి కదాని ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో పెట్టుబడులు పెడితే మొదటికే మోసం వస్తుంది. కంపెనీ ఆర్థిక సామర్థ్యం ఆధారంగా పెట్టుబడులు చేయడం మంచిది. దీనికోసం ఆయా కంపెనీల క్రెడిట్ రేటింగ్లను పరిశీలించాలి. అధిక క్రెడిట్ రేటింగ్ ఏఏఏ గల కంపెనీల దృష్టి పెడితే మంచిది. అలాగే ఒకే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలపై ఆధారపడకుండా, రకరకాల ఏజెన్సీల నుంచి సమాచారాన్ని సేకరించుకోవాలి. మీరు గుర్తెరిగిన ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలలో పెట్టుబడులు చేయవద్దు. ఉదాహరణకు ఏబీసీ అను కంపెనీ టైర్లను ఉత్పత్తి చేస్తోంది. వాటిని మీరు ఎప్పటినుంచో వాడుతున్నారు కాబట్టి, ఆ కంపెనీలలో పెట్టుబడులు పెట్టవద్దు.
ఇబ్బందులున్న కంపెనీలలో పెట్టుబడులు తగదు:
పెట్టుబడులు పెట్టే ముందు ఆయా కంపెనీల ప్రస్తుత, గత పని తీరు, ఆర్థిక సామర్థ్యాలను పరిగణలోనికి తీసుకోవాలి. ఆ రంగంలోని ఇతర కంపెనీలతో పోలిస్తే మీరు పెట్టుబడులు పెట్టాలనుకున్న కంపెనీ వద్ద తగిన నగదు లభ్యత ఉందా లేదా అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. కేవలం అధిక వడ్డీ రేట్లు, ఆఫర్లను చూసి ఆకర్షితులవవద్దు. అంతగా పేరు లేని, ఆర్థిక స్థోమత, నిర్వహణ అధ్వాన్నంగా ఉన్న కంపెనీలకు దూరంగా ఉండటమే మేలు.
ఈ పెట్టుబడులు సురక్షితం కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి:
మదుపరులు నుంచి సమీకరించిన ఫిక్స్డ్ డిపాజిట్లను కంపెనీలు ఎల్లప్పుడూ అసురక్షిత రుణాలుగానే భావిస్తాయి. ఈ తరహా రుణాలు పెట్టుబడిదారులకు కంపెనీలపై ఉన్న విశ్వాసం ఆధారంగానే ఉంటాయి తప్ప, ఆయా కంపెనీలు తమ ఆస్తులను తనఖా పెట్టి రుణాలను సమీకరించవు అన్న విషయాన్ని గుర్తెరగాలి. ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు సమీకరించేటప్పడు, ఆయా కంపెనీలు తమ ఆస్తులను కుదవపెట్టవు గనుక, వాటిని భవిష్యత్ లో నిధుల సమీకరణకు కంపెనీలు వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పెట్టుబడులకు తగిన భద్రత లేదనే విషయాన్ని మదిలో ఉంచుకోవాలి.
పన్ను ఎక్కువగా కట్టేవారికి ఇవి అంతగా సరిపోవు:
బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్నందుకే ఇవి ప్రతీ ఒక్కరిని ఆకర్సిస్తున్నాయి. అయితే మీరు 30 శాతం ఆదాయ పన్ను కేటగిరిలో ఉంటే మీరు చేసే పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని మించి రాణించే అవకాశాలు తక్కువ. కాబట్టి పన్నులు ఎక్కువగా చెల్లించే వారికి ఇవి అంతగా సరిపోవు. కాబట్టి వారు ప్రత్యామ్నాయ ఆర్థిక సాధనాలలో పెట్టుబడులు చేయడం మంచిది.
పై వివరణను పరిశీలించిన తర్వాత, స్థిరమైన ఆదాయం గల వారికి ఇవి సరిపోతాయి. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మంచి, చెడులూ తెలుసుకుని రంగంలోకి దిగడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్