Flipkart: ‘బిగ్ సేవింగ్ డేస్’లో ఆఫర్లివే!
ప్రముఖ ఆన్లైన్ వస్తు విక్రయ వేదిక ‘ఫ్లిఫ్కార్ట్’ జులై 25 నుంచి 29వ తేదీ వరకూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్స్ను నిర్వహిస్తున్న సంగతి
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ ఆన్లైన్ వస్తు విక్రయ వేదిక ‘ఫ్లిఫ్కార్ట్’ జులై 25 నుంచి 29వ తేదీ వరకూ ‘బిగ్ సేవింగ్స్ డేస్’ సేల్స్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సేల్లో భాగంగా పలు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులు ఒకరోజు ముందుగానే అంటే జులై 24 నుంచే ఈ డీల్స్ను పొందే అవకాశం ఉంది.
రియల్ మి, పోకో, వీవో, మోటోరోలా తదితర మొబైల్ ఫోన్లతో పాటు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై రాయితీలు లభించనున్నాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారు 10శాతం తక్షణ రాయితీని పొందే అవకాశం ఉంది. బిగ్ సేవింగ్స్ డేస్లో భాగంగా రియల్మి సీ20 రూ.500 తగ్గి రూ.6,499కే లభించనుంది. ఇక రూ.18,999 విలువైన పోకో ఎక్స్3 ప్రో రూ.17,249... రూ.19,999 ధర ఉన్న రియల్ మి ఎక్స్7 5జీ ఫోన్ రూ.18,999... మోటో జీ40 రూ.13,499(అసలు ధర రూ.14,999)లకే లభించనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 ధరను కూడా తగ్గించనున్నట్లు ఫ్లిప్కార్ట్ పేర్కొంది. అయితే, ఎంత డిస్కౌంట్ వస్తుందనే మాత్రం చెప్పలేదు.
ఐఫోన్ ఎస్ఈ2020 మోడల్ రూ.28,999(అసలు ధర రూ.39,900), ఐఫోన్ ఎక్స్ ఆర్ రూ.37,999(అసలు ధర రూ.47,900), ఐఫోన్ 12 రూ.67,999(అసలు ధర రూ.79,900)లకే లభించనున్నాయి. వీటితో పాటు పలు టెలివిజన్లు 65శాతం వరకూ తగ్గింపుతో లభించనున్నాయి. అంతేకాదు, వివిధ ఉత్పత్తులను వడ్డీ రహిత వాయిదాల్లో పొందవచ్చు. ఎల్జీ, శాంసంగ్, వర్ల్ఫూల్ ఏసీలు రూ.23,490 నుంచి ప్రారంభంకానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ