అమెరికాలో లిస్టింగ్‌కు ఫ్లిప్‌కార్ట్‌ కసరత్తు!

వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్‌ అమెరికా స్టాక్‌ఎక్స్ఛేంజీలో నమోదుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లేందుకు విలీనం సహా పలు మార్గాలను అన్వేషిస్తోందని ఈ పరిణామాన్ని

Published : 05 Mar 2021 00:50 IST

విలీనం సహా పలు మార్గాల అన్వేషణ

దిల్లీ: వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్‌ అమెరికా స్టాక్‌ఎక్స్ఛేంజీలో నమోదుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లేందుకు విలీనం సహా పలు మార్గాలను అన్వేషిస్తోందని ఈ పరిణామాన్ని గమనిస్తున్న వర్గాలు పేర్కొన్నాయి. విలీనం నిమిత్తం ఫ్లిప్‌కార్ట్‌ సలహాదారులు ఇప్పటికే పలు స్పెషల్‌ పర్పస్‌ అక్వయిజేషన్‌ కంపెనీలతో (ఎస్‌పీఏసీలు) సంప్రదింపులు జరిపారని తెలిపాయి. రెండేళ్లలో ఏదేని వ్యాపారాన్ని కొనుగోలు చేసే ఉద్దేశంతో మదుపర్ల నుంచి ఎస్‌పీఏసీలు నిధులు సమీకరిస్తుంటాయి. ఈ తరహా ఎస్‌పీఏసీలతో విలీనం కావడం వల్ల సాధారణ మార్గం కంటే వేగంగా పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాగా.. ఫ్లిప్‌కార్ట్‌ తన విలువను 3500 కోట్ల డాలర్లుగా చెబుతోందని, ప్రస్తుతానికి ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధి నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఎస్‌పీఏసీలతో జట్టుకట్టడం ద్వారా అమెరికాలో లిస్టింగ్‌ అవకాశాలను పరిశీలిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌, భారత్‌లోనూ గ్రోఫోర్స్‌ లాంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తద్వారా తన విలువను మరింతగా పెంచుకోవాలని భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని