ఇంకా రీఫండ్ రాకపోతే ఇలా చేయండి
గత సంవత్సరాలలోని అవుట్స్టాండింగ్ ట్యాక్స్ డిమాండ్ పెండింగ్లో ఉన్నందున ఇంకా కొందరికి రీఫండ్ రాలేదు
ఇటీవల ఆదాయ పన్ను శాఖ పెండింగ్లో ఉన్న రూ.5 లక్షల వరకు రీఫండ్లను దాదాపు 14 లక్షల పన్ను చెల్లింపుదారులకు వెంటనే జారీచేయనున్నట్లు తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులు , సూక్ష్మ- మధ్యతరహా సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
మునుపటి సంవత్సరాల నుంచి ఉన్న అవుట్స్టాండిగ్ పన్ను డిమాండ్ కారణంగా కొంతమంది ఆదాయపు పన్ను రీఫండ్ పొందలేకపోయాయని ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వచ్చింది.
ఏప్రిల్ 15 న సీబీడీటీ ప్రకటన ప్రకారం, 1.74 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు వారి అవుట్స్టాండింగ్ పన్ను డిమాండ్తో సయోధ్యకు సంబంధించి పంపిన ఇమెయిల్లకు ప్రతిస్పందన కోసం ఈ విభాగం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఈ పన్ను చెల్లింపుదారులకు ఏడు రోజుల్లో స్పందించమని కోరుతూ రిమైండర్ ఇమెయిళ్ళు పంపించింది, తద్వారా రీఫండ్ ప్రాసెస్ అవుతుంది.
కాబట్టి, మీరు ఆదాయపు పన్ను రీఫండ్ పొందవలసి ఉన్న వ్యక్తి అయితే ఇంకా అందుకోకపోతే, పెండింగ్లో ఉన్న సర్దుబాటుకు మునుపటి ఆర్థిక సంవత్సరాల నుండి చెల్లించాల్సిన పన్ను డిమాండ్కు సంబంధించి మీ స్పందన కోసం పన్ను విభాగం ఎదురుచూస్తుంది.
వ్యక్తులు తమ ఆదాయపు పన్ను శాఖ ఖాతాకు లాగిన్ అవ్వడం ద్వారా వారి అవుట్స్టాండింగ్ పన్ను డిమాండ్ను చూడవచ్చు. దీనికోసం…
- ఇ-ఫైలింగ్ ఖాతాలోకి పాన్, యూజర్ ఐడీ, పాస్ వర్డ్తో లాగిన్ కావాలి
- తర్వాత ‘e-file’ ట్యాబ్పై క్లిక్ చేసి ‘Response outstanding tax demand’ సెలక్ట్ చేసుకోవాలి
- అక్కడ నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి.
A. Demand is correct
B. Demand is partially incorrect
C. Disagree with demand
D. Demand is not correct but agree for adjustment
మీకు తగిన ఆప్షన్ ఎంచుకొని ‘Submit’ పై క్లిక్ చేయాలి
మీ ఆదాయపు పన్ను వాపసును ప్రాసెస్ చేయడానికి పన్ను శాఖకు అనుగుణంగా డిమాండ్కు ప్రతిస్పందించండి. చెల్లించాల్సింది ఇంకా పెండింగ్లో ఉంటే దాన్ని మీ బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ చేయండి. పన్ను చెల్లింపుదారులు అటువంటి ఇమెయిల్లకు త్వరగా స్పందించాలి, తద్వారా రీఫండ్ను ప్రాసెస్ చేయవచ్చు, దీంతో వీలైనంత త్వరగా జారీ చేసే అవకాశం ఉంటుందని సీబీడీటీ స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్