పెట్టుబ‌డుల‌కు ముందు కాంపౌండింగ్ గురించి తెలుసుకోండి

కాంపౌండింగ్ వ‌డ్డీని త్రైమాసిక లేదా వార్షికానికి లెక్కిస్తున్నారా తెలుసుకోవాలి

Published : 18 Mar 2021 13:12 IST

పెట్టుబడులలో సమ్మేళనం  గణనీయమైన లాభాన్ని అందిస్తుంది. అందువల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ పెట్టుబడి పెట్టడానికి ముందు, కాంపౌండింగ్ వ‌డ్డీని త్రైమాసిక లేదా వార్షికానికి లెక్కిస్తున్నారా తెలుసుకోవాలి.

ఇండియా పోస్ట్ అందించే చిన్న పొదుపు పథకం ఉదాహరణను తీసుకోండి. టైమ్ డిపాజిట్లు త్రైమాసిక సమ్మేళనాన్ని అందిస్తాయి, అయితే కిసాన్ వికాస్ ప‌త్ర‌, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లలో కాంపౌండింగ్ వార్షికంగా లెక్కిస్తారు.

 అయితే ఈ సమ్మేళనం త్రైమాసికానికి, వార్షికానికి  లెక్కిస్తే పెట్టుబ‌డుల్లో ఎలా మార్పు తెస్తుందో ఇక్కడ తెలుసుకోండి
 మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ల‌క్ష రూపాయ‌లు పెట్టుబడి పెట్టారని అనుకోండి. ఇది 6 శాతం వడ్డీని అందిస్తుంది.  కాంపౌండింగ్ సంవ‌త్స‌రానికి లెక్కిస్తే రూ. 1,06,000 పొందుతారు. అదే త్రైమాసికానికి అయితే రూ. 106,136 లభిస్తుంది -  అంటే రూ.136 ఎక్కువ‌.

ఈ మొత్తం 6 శాతం వద్ద లెక్కిస్తున్నాం కాబ‌ట్టి చాలా తక్కువగా క‌నిపించ‌వ‌చ్చు. అదే 10 సంవత్సరాల కాలానికి 9 శాతం వడ్డీ రేటును అందించే ప‌థ‌కంలో  రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టార‌ని అనుకోండి. ఇక్క‌డ‌ గణాంకాలు ఎలా పని చేస్తాయో ఇక్కడ ఉంది.

పదేళ్ల‌ తరువాత,  త్రైమాసికం వారిగా కాంపౌండింగ్ చేస్తే, పెట్టుబడిదారుడికి, రూ.12,17,594 లభిస్తుంది. అదే సమ్మేళనం వార్షికమైతే, మొత్తం రూ.11,83,682 అవుతుంది. అంటే తేడా రూ. 33,912 అవుతుంది. ఇది ప్రారంభంలో పెట్టుబడి పెట్టిన మొత్తంలో దాదాపు 7 శాతం.

సంపదను సృష్టించడానికి శక్తివంతమైన సాధనం కాంపౌండింగ్. ఈక్విటీ ఫండ్ క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలో సమ్మేళనం ఎలా పనిచేస్తుందో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు, మీరు 20 నెలలు ప్రతి నెలా రూ. 10,000 పెట్టుబడి పెడితే  పెట్టుబడి మొత్తం రూ. 24 లక్షలు అవుతుంది.  ఈక్విటీ పెట్టుబడి ప్రతి సంవత్సరం సగటున 12 శాతం రాబడిని ఇస్తే కాంపౌండింగ్‌తో క‌లిపి కోటి రూపాయ‌లు కార్పస్ పొందుతారు. డెట్ పెట్టుబడులలో కాంపౌండిగ్ చాలా ముఖ్యం. అందువల్ల, మీ పెట్టుబడిపై సమ్మేళనంతో ల‌భించి లాభం వ‌చ్చేవ‌ర‌కు వేచిచూడాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని