GST: జీఎస్‌టీ వసూళ్లు రూ.1.30లక్షల కోట్లు.. ఇదే రెండో అత్యధికం  

కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి పలు రంగాలు కోలుకోవడంతో గత కొద్ది నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు కూడా పుంజుకుంటున్నాయి. వరుసగా నాలుగో నెల రూ.లక్ష కోట్లు

Updated : 01 Nov 2021 16:14 IST

దిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి పలు రంగాలు కోలుకోవడంతో గత కొద్ది నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు కూడా పుంజుకుంటున్నాయి. వరుసగా నాలుగో నెల రూ.లక్ష కోట్ల వసూళ్లను అధిగమించాయి. అక్టోబరు నెలలో రూ.1.30లక్షల కోట్లు వసూలయ్యాయి. 2017 జులైలో జీఎస్‌టీని అమల్లోకి తెచ్చిన తర్వాత ఇదే రెండో అత్యధిక ఆదాయం కావడం విశేషం.

అక్టోబరు నెలకు గానూ రూ.1,30,127 కోట్ల జీఎస్‌టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ సోమవారం వెల్లడించింది. ఇందులో కేంద్ర జీఎస్‌టీ రూ.23,861 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్‌టీ రూ.30,421 కోట్లు. సమ్మిళిత జీఎస్‌టీ కింద రూ.67,361 కోట్లు(వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.32,998 కోట్లతో కలిపి), సెస్‌ రూపంలో రూ.8,484 కోట్లు(వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.699 కోట్లతో కలిపి) వసూలైనట్లు ఆర్థికశాఖ తెలిపింది. 

గతేడాది అక్టోబరుతో పోలిస్తే గత నెల జీఎస్‌టీ వసూళ్లు 24శాతం పెరిగాయి. అంతేగాక, జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో జీఎస్‌టీ ఆదాయం రావడం ఇదే రెండోసారి మాత్రమే అని ఆర్థికశాఖ పేర్కొంది. 2021 ఏప్రిల్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు ఆల్‌టైం రికార్డును తాకాయి. ఆ నెల రూ.1.41లక్షల కోట్లు వసూలయ్యాయి. 

ఈ ఏడాదిలో జీఎస్‌టీ వసూళ్లు ఇలా ఉన్నాయి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని