MSME: ఆ నిర్ణయం ఓ మైలురాయి: మోదీ
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈలు) విభాగంలోకి రిటైల్, టోకు వాణిజ్యాన్ని చేర్చడాన్ని కీలక నిర్ణయంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. చిరు వ్యాపారులకు ప్రోత్సాహం లభించడంతో.....
రిటైల్, టోకు వాణిజ్యాన్ని ఎంఎస్ఎంఈలో చేర్చడంపై మోదీ
దిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈలు) విభాగంలోకి రిటైల్, టోకు వాణిజ్యాన్ని చేర్చడాన్ని ఓ మైలురాయిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. చిరు వ్యాపారులకు ప్రోత్సాహం లభించడంతో పాటు పలు ప్రయోజనాలు అందనున్నాయన్నారు. ‘‘రిటైల్, టోకు వాణిజ్యాన్ని ఎంఎస్ఎంఈలో భాగం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓ మైలురాయిగా నిలవనుంది. దీంతో మన వ్యాపారులకు ఆర్థిక వనరులు సులభంగా సమకూరనున్నాయి. వారి వ్యాపారాలకు ఊతమిచ్చేలా ఇతర ప్రయోజనాలు కూడా అందనున్నాయి. మన వ్యాపారులు సాధికారిత సాధించేలా చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని మోదీ ట్వీట్ చేశారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈలు) విభాగంలోకి రిటైల్, టోకు వాణిజ్యాన్ని చేరుస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ప్రకటించారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. ఈ వ్యాపారాలకూ ప్రాధాన్య రంగ రుణాలు లభిస్తాయని వెల్లడించారు. ఎంఎస్ఎంఈల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆర్థికాభివృద్ధిలో వీటిని భాగం చేయనున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు. సవరించిన మార్గదర్శకాలతో 2.5 కోట్ల మంది రిటైల్, టోకు వర్తకులకు లబ్ధి చేకూరనుంది. ఉద్యమ్ పోర్టల్లో నమోదు కావడానికి కూడా దోహదపడనుంది. ప్రాధాన్య రంగం కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వ్యాపారులు కూడా రుణాలు పొందడానికి తాజా నిర్ణయం సహాయపడుతుందని కాన్ఫడెరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (కాయిట్) పేర్కొంది. ఎంఎస్ఎంఈలకు అందిస్తున్న పలు ప్రభుత్వ పథకాలను కూడా వర్తకులు పొందే సౌలభ్యం ఉందని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్