గోద్రేజ్‌ కన్జూమర్‌ ఆదాయంలో 13% వృద్ధి

అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (జీసీపీఎల్‌) ఏకీకృత ప్రాతిపదికన రూ.502.08 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది

Updated : 09 Feb 2021 04:25 IST

దిల్లీ: అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (జీసీపీఎల్‌) ఏకీకృత ప్రాతిపదికన రూ.502.08 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ.445.20 కోట్లతో పోలిస్తే లాభం 12.77 శాతం పెరిగింది. దేశీయ అమ్మకాల్లో బలమైన వృద్ధి నమోదుకావడం ఇందుకు దోహదం చేసింది. కార్యకలాపాల ద్వారా మొత్తం ఆదాయం రూ.2,778.05 కోట్ల నుంచి 9.98 శాతం పెరిగి రూ.3,055.42 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.2,435.11 కోట్లుగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని