Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై సోమవారం రూ.441 తగ్గగా.. ఈరోజు పెరుగుదల నమోదైంది......
దిల్లీ: బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై సోమవారం రూ.441 తగ్గగా.. ఈరోజు పెరుగుదల నమోదైంది. దేశ రాజధాని దిల్లీ నగరంలో మంగళవారం 10గ్రాముల పసిడి ధరపై రూ.303లు పెరగడంతో 47,853కి చేరింది. గత ట్రేడింగ్లో పసిడి ధర రూ.47,550గా ముగిసింది. మరోవైపు, వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి నిన్న రూ.70,127 ఉండగా.. ఈ రోజు పై రూ. 134లు పెరగడంతో రూ.70,261కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1864.50 డాలర్లుగా ట్రేడ్ అవుతుండగా.. వెండి ధర 27.65 డాలర్లుగా కొనసాగుతోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వు సమావేశం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ ఈ హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ (కమోడటీస్) సీనియర్ విశ్లేషకుడు తపన్ పటేల్ తెలిపారు. తాజా పెరుగుదలతో హైదరాబాద్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.50వేలకు పైగా (అన్ని ట్యాక్స్లతో కలిపి) ట్రేడ్ అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.