తగ్గిన బంగారం ధర

దేశంలో బంగారం ధర మరోసారి తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో పది గ్రాముల మేలిమి పసడి ధర రూ.661 తగ్గి 46,847కి చేరింది. వెండి సైతం కిలోకు రూ.347 తగ్గింది. దిల్లీలో.

Published : 12 Feb 2021 16:36 IST

దిల్లీ: దేశంలో బంగారం ధర మరోసారి తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో పది గ్రాముల మేలిమి పసడి ధర రూ.661 తగ్గి 46,847కి చేరింది. వెండి సైతం కిలోకు రూ.347 తగ్గింది. దిల్లీలో దీని ధర రూ.67,894కి చేరింది. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గడం, రూపాయి విలువ స్వల్పంగా కోలుకోవడం దేశంలో బంగారం ధరల తగ్గుదలకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. డాలరు విలువ పెరగడం అంతర్జాతీయంగా బంగారం విలువ తగ్గడానికి కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1815 డాలర్లు ఉండగా.. వెండి 26.96 డాలర్లు ఉంది.

ఇవీ చదవండి..
గృహ బీమాలో ఏముంటాయ్‌? క్లెయిం ఎలా?
పెట్రో మంటలకు కారణాలివే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని