Gold Rate: మరింత తగ్గిన బంగారం ధర
గత కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న బంగారం ధర శుక్రవారం ఒక్కసారిగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల......
దిల్లీ: గత కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న బంగారం ధర శుక్రవారం ఒక్కసారిగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.451 తగ్గి రూ.46,844కు చేరింది. క్రితం ట్రేడింగ్లో దీని ధర రూ.47,295గా ఉంది. మరోవైపు, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. నిన్న కిలో వెండిపై రూ.900కు పైగా తగ్గిన వెండి ధర శుక్రవారం రూ.559 తగ్గడంతో రూ.67,465కు చేరింది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1805 అమెరికా డాలర్లుగా ట్రేడవుతుండగా.. ఔన్సు వెండి ధర 25.93 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయంగా మార్కెట్లో నెలకొన్న ప్రతికూలత పరిస్థితులే విలువైన లోహాల ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.49,200కు (అన్ని ట్యాక్స్లతో కలిపి) పైగా ట్రేడవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!