IT returns: ఐటీ రిటర్నుల దాఖలుకు మరోసారి గడువు పొడిగింపు
ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మళ్లీ పొడిగించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో.....
దిల్లీ: ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును ఆడిట్ వర్తించే సంస్థలకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మళ్లీ పొడిగించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి మార్చి 15 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని నిబంధనల ప్రకారం వివిధ ఆడిట్ రిపోర్టుల ఈ-ఫైలింగ్ చేసేటప్పుడు ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా కూడా ఈ గడువును పొడిగిస్తున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఐటీ శాఖ ట్విటర్లో పోస్ట్ చేసింది.
ఐటీ రిటర్నుల దాఖలు కోసం ఇన్ఫోసిస్ సంస్థ రూపొందించిన కొత్త వెబ్సైట్లో సాంకేతికత సమస్యల పరిష్కారం కొలిక్కిరాని నేపథ్యంలో సెప్టెంబరు 30 వరకు ఉన్న ఈ గడువును డిసెంబర్ 31 వరకు పెంచుతూ గతంలో కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఐటీఆర్ గడువును పెంచే యోచనలేదని గతేడాది డిసెంబర్లో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.