కొత్త సంస్కరణలతో పన్ను చెల్లింపుదారులకు మరింత ఊరట
ఇది దేశంలోని పన్నుల వ్యవస్థను మరింత సరళీకృతం చేసేందుకు బలం చేకూరుస్తుంది
నిజాయితీగల పన్ను చెల్లింపుదారులను గౌరవించటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు పన్ను సంస్కరణలను ప్రకటించారు, ఇవి పన్ను వసూలు విధానంలో పారదర్శకతను తీసుకువస్తాయని, తద్వారా పన్నులు చెల్లించడానికి ప్రజలను ప్రోత్సహిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపన్ను వ్యవస్థలో సంస్కరణలను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు మరింత సాధికారికత లభించే విధంగా 'పారదర్శక పన్ను విధానం’ను ప్రకటించింది.
ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్నుల విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ప్రధాని మోదీ చెప్పారు. ప్రత్యేక వేదిక ద్వారా సులువుగా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. నిజాయతీగా పన్నులు చెల్లించే వారికి ప్రత్యేక వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. పన్నుల సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరమని అభిప్రాయపడ్డారు. పన్ను చెల్లింపు దారులు మరింత పెరిగేందుకు ఈ వేదిక దోహదపడుతుందన్నారు. సక్రమపన్ను చెల్లింపుదారులను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు.
ప్రకటించిన పన్ను సంస్కరణలు: ఫేస్లెస్ అప్పీల్, ఫేస్లెస్ అసెస్మెంట్ , ట్యాక్స్ పన్ను చార్టర్. ఫేస్ లెస్ అసెస్మెంట్, ట్యాక్స్ చార్టర్ గురువారం నుంచి అందుబాటులోకి వస్తాయి. అయితే ఫేస్ లెస్ అప్పీల్ సెప్టెంబర్ 25 నుంచి అమలులోకి వస్తుంది.
గత కొన్ని సంవత్సరాలుగా, పన్ను చెల్లింపుదారులపై సమ్మతి భారాన్ని తగ్గించడానికి, పన్ను శాఖ వ్యవహారాలలో పారదర్శకతను తీసుకురావడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇటీవల ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులతో చేసిన అన్ని సమాచారాలలో డాక్యుమెంటేషన్ ఐడెంటిఫికేషన్ నంబర్ (డిఐఎన్) ను ప్రవేశపెట్టింది. డీఐఎన్ లేకుండా ఏదైనా ఆర్డర్ లేదా నోటీసు చెల్లదు.
ఈ కొత్త ప్రకటనలతో, పన్ను విభాగం నుంచి పన్ను చెల్లింపుదారులకు కమ్యూనికేషన్లు మరింత డిజిటలైజ్ అవుతాయి. ఇది పన్ను అధికారుల జోక్యాన్ని తగ్గిస్తుంది, దీంతో పన్ను చెల్లింపుదారుల అవినీతి, వేధింపులను తగ్గిస్తుంది. ఫేస్లెస్ అప్పీల్, ఫేస్లెస్ అసెసమెంట్ ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకుందాం.
ఒక పన్ను చెల్లింపుదారుడు అంచనా వేసే అధికారి ఇచ్చిన ఉత్తర్వుతో ఏకీభవించకపోతే, దీనికి వ్యతిరేకంగా ఆదాయపు పన్ను కమిషనర్కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేయవచ్చు. ఫేస్లెస్ అప్పీల్ ఎంత ప్రభావవంతంగా ఉంటుందో అనే విషయం, వాస్తవానికి ఇది పన్ను శాఖ ఎలా అమలు చేస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ఫేస్లెస్ అప్పీల్ ప్రయత్నం , ఒక బలమైన, బలమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రభుత్వం నిర్ణీత సమయంలో రూపొందించే పద్ధతులు నియమాలపై ఆధారపడి దీని ఫలితం ఉంటుంది.
ఇ-అసెస్మెంట్ పథకంపై తుది మార్గదర్శకాలను ప్రభుత్వం గత ఏడాది తెలియజేసింది. అయితే ఈ పథకం ఇంతకుముందు ఆప్షన్గా ఉండేది, దీంతో పాటు కొన్ని నగరాల్లో మాత్రమే అమలు చేశారు. కానీ ఇప్పుడు తాజా ప్రకటనతో కొందరిని మినహాయించి అందరికీ ఇది తప్పనిసరి అయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం