Defence: ₹43 వేల కోట్లతో 6 జలాంతర్గాములు
భారత నావికాదళానికి సుమారు రూ.43,000 కోట్ల వ్యయంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత....
దిల్లీ: భారత నావికాదళానికి సుమారు రూ.43,000 కోట్ల వ్యయంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ‘రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఎసీ)’ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టకుకు ‘పీ -75 ఇండియా’ పేరిట త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) జారీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆర్ఎఫ్పీ జారీకి కావాల్సిన పనులన్నింటినీ పూర్తి చేసినట్లు పేర్కొన్నాయి. జలాంతర్గాముల స్పెసిఫికేషన్లు సహా ఇతర అవసరాలను రక్షణ మంత్రిత్వ శాఖ, భారత నావికాదళం సహా ఇతర బృందాలు కలిసి పూర్తిచేశాయని తెలిపాయి. సముద్ర జలాల్లో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న సమయంలో కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!