​​​​​​ఎయిర్‌ బ్యాగ్స్‌ నిబంధన అమలు వాయిదా

ఇప్పటికే ఉత్పత్తి అయిన కార్లలో ముందువైపు రెండు ఎయిర్‌బ్యాగుల నిబంధనను కేంద్రం వాయిదా వేసింది. దీనికి నిర్దేశించిన గడువును రహదారుల మంత్రిత్వ శాఖ మరో నాలుగ.....

Published : 27 Jun 2021 20:20 IST

దిల్లీ: ఇప్పటికే ఉత్పత్తి అయిన కార్లలో ముందువైపు రెండు ఎయిర్‌బ్యాగుల నిబంధనను కేంద్రం వాయిదా వేసింది. దీనికి నిర్దేశించిన గడువును రహదారుల మంత్రిత్వ శాఖ మరో నాలుగు నెలలు పొడిగించింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. తాజా గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగించినట్లు తెలిపారు.

ఏప్రిల్‌ 1, ఆ తర్వాత తయారైన వాహనాలకు ముందువైపు రెండు ఎయిర్‌బ్యాగులను తప్పనిసరి చేస్తూ మార్చి 6న రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే ఉత్పత్తి అయిన మోడళ్లకు ఆగస్టు 31ను గడువుగా నిర్ణయించారు. దాన్ని తాజాగా నాలుగు నెలలు పొడిగించారు. డ్రైవర్‌ సీటుకు ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి నిబంధన చాలా రోజులుగా అమలవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని