IT returns: ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు

పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరట కల్పించింది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును....

Updated : 09 Sep 2021 20:24 IST

దిల్లీ: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరట కల్పించింది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును పెంచింది. 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్‌ దాఖలు చేయడానికి  డిసెంబర్‌ 31వ తేదీ వరకు  అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ గురువారం ప్రకటించింది. కరోనా వైరస్‌తో నెలకొన్న పరిస్థితుల కారణంగా గతంలో సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు, ఐటీ రిటర్నుల దాఖలు కోసం ఇన్ఫోసిస్‌ సంస్థ రూపొందించిన కొత్త వెబ్‌సైట్‌లో సాంకేతికత సమస్యల పరిష్కారం కొలిక్కిరాని నేపథ్యంలో సెప్టెంబరు 30 వరకు ఉన్న ఈ గడువును డిసెంబర్‌ 31 వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఈ ఏడాది జూన్‌ 7న ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్‌సైట్‌  ( www.incometax.gov.in)ను ఇన్ఫోసిస్‌ సాంకేతిక సహకారంతో అందుబాటులోకి తీసుకురాగా.. అప్పటి నుంచి సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించిన చేసిన ఇన్ఫోసిస్‌కు కేంద్రం డెడ్‌లైన్‌ విధించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం ఇన్ఫోసిస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సలీల్‌ పరేఖ్‌ భేటీ సందర్భంగా ఈ గడువు నిర్దేశించారు. సెప్టెంబర్‌ 15లోగా పోర్టల్‌కు సంబంధించిన లోపాలను సవరించాలని కేంద్రం సూచించింది. పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన రెండు నెలల దాటినా సమస్యలు ఉత్పన్నమవుతుండడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని