SBI: వేరే బ్రాంచ్కి ఖాతా బదిలీ ఇలా!
ఆన్లైన్ ద్వారా ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కు ఖాతాను బదిలీ చేసుకునే సౌకర్యాన్ని ఎస్బీఐ అందిస్తుంది.
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులా? మీ ఖాతాను వేరే బ్రాంచ్కి బదిలీ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు బ్యాంకుకు వెళ్లకుండానే, ఆన్లైన్ ద్వారా ఒక శాఖ నుంచి మరొక శాఖకు ఖాతాను బదిలీ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఎస్బీఐ ట్విటర్ ద్వారా తెలియజేసింది. కరోనా నేపథ్యంలో, కాంటాక్ట్ లెస్ డిజిటల్ సేవలకు బ్యాంకు ప్రాధాన్యం ఇస్తుందని ఇందులో భాగంగానే ఈ సేవలను అందిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఎస్బీఐ ఖాతాదారులు ప్రస్తుతం ఉన్న ఖాతాను మరొక శాఖకు బదిలీ చేయాలనుకుంటే బ్యాంకు మీకు సహాయపడుతుంది. యోనో ఎస్బీఐ, యోనో లైట్, ఆన్లైన్ ఎస్బీఐ ద్వారా ఇంటి వద్ద నుంచి సౌకర్యవంతంగా, సురక్షితంగా బ్యాంకింగ్ లావాదేవీల చేయవచ్చని ఎస్బీఐ ట్వీట్ చేసింది.
ఒక శాఖకు నుంచి మరొక శాఖకు ఆన్లైన్ ద్వారా ఖాతాను బదిలీ చేసుకునే విధానం..
1. ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్కు లాగిన్ అవ్వాలి.
2. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్లను ఉపయోగించి ‘పర్సనల్ బ్యాంకింగ్’ను తెరవండి.
3. ఇప్పుడు టాప్ మెనూ బార్లో అందుబాటులో ఉన్న ‘ఇ-సర్వీసెస్’ ట్యాబ్ను క్లిక్ చేయాలి.
4. ఇందులో ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్స్ అక్కౌంట్’ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
5. ఇప్పుడు మీరు బదిలీ చేయాలనుకుంటున్న ఖాతాను సెలక్ట్ చేసుకోవాలి. ఒకవేళ సీఐఎఫ్(కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్) కింద ఒకటే ఖాతా ఉంటే.. ఆ ఖాతా డిఫాల్ట్గా సెలక్ట్ అవుతుంది.
6. ఇప్పుడు, మీరు ఏ బ్రాంచ్కి అయితే ఖాతాను బదిలీ చేయాలనుకుంటున్నారో.. ఆ బ్రాంచ్ కోడ్ను నమోదు చేయాలి. నిబంధనలు, షరతులను పూర్తిగా చదివి అంగీకారం తెలిపే బాక్స్లో టిక్ చేసి, సబ్మిట్పై క్లిక్ చేయాలి.
7. ఇప్పటికే ఉన్న బ్రాంచ్ కోడ్, కొత్త బ్రాంచ్ కోడ్తో పాటు మీ ఖాతా బదిలీ వివరాలను మరోసారి సరిచూసుకుని ‘కన్ఫర్మ్’పై క్లిక్ చేయడం ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది.
8. మీరు వివరాలను ధ్రువీకరించిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది.
9. ఓటీపీని ఎంటర్ చేసి మరోసారి కన్ఫర్మ్పై క్లిక్ చేయాలి.
10. మీ బ్రాంచి బదిలీ రిక్వెస్ట్ విజయవంతంగా రిజిస్టర్ అయినట్లు మీ మొబైల్కి సందేశం వస్తుంది.
ఆన్లైన్ ఎస్బీఐ ద్వారా మాత్రమే కాకుండా యోనో ఎస్బీఐ, యోనో లైట్ ద్వారా కూడా ఖాతాలను బదిలీ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీ బ్యాంకు వద్ద మొబైల్ నెంబరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆన్లైన్ ద్వారా ఈ సేవలను పొందగలుగుతారు.
కొవిడ్-19 కారణంగా చాలా రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. దీంతో ప్రజలు బ్యాంకుకు వచ్చే వీలులేదు. అలాగే ప్రజల భద్రత దృష్ట్యా కూడా డిజిటల్ మార్గాల ద్వారా వివిధ రకాలను సేవలను ఎస్బీఐ అందిస్తుంది. కేవైసీ అప్డేట్ను కూడా ఆన్లైన్ ద్వారానే నిర్వహించేందుకు వీలుకల్పిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే ఎస్బీఐ ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా కేవైసీని అప్డేట్ చేయాలనుకునే వారు ఇ-మెయిల్ ద్వారా గానీ పోస్ట్ ద్వారా గానీ అవసరమైన పత్రాలను బ్యాంకుకు పంపిచాల్సి ఉంటుంది. కేవైసీ కారణంగా ఖాతాల తాత్కాలిక నిలుపుదలను అడ్డుకునేందుకు మే 31, 2021 లోపుగా అప్డేట్ చేయాలని బ్యాంకు ఖాతాదారులను కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!