Hero XPulse: భారత్‌లో హీరో ఎక్స్‌ప్లస్‌ 200 4వీ విడుదల

దేశీయ మార్కెట్లోకి హీరో మరో మోటార్‌ సైకిల్‌ను ప్రవేశపెట్టింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.28లక్షలుగా పేర్కొంది. అడ్వెంచర్‌ మోటార్‌ సైక్లింగ్‌లో

Published : 08 Oct 2021 16:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్లోకి హీరో మరో మోటార్‌ సైకిల్‌ ‘ఎక్స్‌ప్లస్‌ 200 4వీ’ని ప్రవేశపెట్టింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.28లక్షలుగా పేర్కొంది. అడ్వెంచర్‌ మోటార్‌ సైక్లింగ్‌లో ఎంట్రి లెవల్‌ వాహనమైన ఎక్స్‌ప్లస్‌కు ఫోర్‌వాల్వ్‌ టెక్నాలజీని వినియోగించింది. దీనికి 199.6 సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 18.8 బీహెచ్‌పీ శక్తిని, 17.35 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను విడుదల చేస్తుంది. గతంలో ఉన్న టూవాల్స్‌ టెక్నాలజీ ఇంజిన్‌ 17.8 బీహెచ్‌పీ శక్తిని మాత్రమే విడుదల చేస్తుంది. కొత్త ఇంజిన్‌తో శక్తి ఆరుశాతం, టార్క్‌ ఐదు శాతం పెరిగాయి. ధరలో కూడా రూ.5000 ఎక్కువ.

సరికొత్త బైక్‌లో కూలింగ్‌ వ్యవస్థను కూడా 7ఫిన్‌ ఆయిల్‌ ఫిల్టర్లతో మరింత మెరుగు పర్చినట్లు హీరో పేర్కొంది. వేగం, పట్టు కోసం గేర్‌ వ్యవస్థలో మార్పులు చేశామని, వైబ్రేషన్స్‌ తగ్గించినట్లు తెలిపింది. ఈ బైకు ట్రెయిల్‌బ్లూ, బ్లిట్జ్‌ బ్లూ, రెడ్‌ రైడ్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇంటిగ్రేడ్‌ స్టార్టర్‌, ఇంజిన్‌ కటాఫ్‌ స్విచ్‌, సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్‌, బ్లూటూత్‌ అనుసంధానించే ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ఏబీఎస్‌ ఫీచర్లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని