ఇలా చేస్తే వారం రోజుల్లోపు మీకు రీఫండ్ రావొచ్చు
ఏప్రిల్ 14 నాటికి 10.2 లక్షల మందికి రూ.4,250 కోట్ల పన్నురీఫండ్ ప్రాసెస్ చేసినట్లు సీబీడీటీ వెల్లడించింది
కోవిడ్-19 మహమ్మారి నుంచి పన్ను చెల్లింపుదారులకు కాస్త ఊరట కలిగించేందకు రూ.5 లక్షల లోపు ఉన్న రీఫండ్ జారీ చేస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 14 నాటికి 10.2 లక్షల మందికి రూ.4,250 కోట్ల పన్నురీఫండ్ ప్రాసెస్ చేసినట్లు సీబీడీటీ ఇటీవల వెల్లడించింది. ఇంకా 1.75 లక్షల రీఫండ్ల ప్రాసెస్ జరగుతుందని ప్రకటించింది.
మీ ఐటీఆర్ ప్రాసెస్ పూర్తయిందా?
ఆదాయ పన్న రీఫండ్ కావాలంటే ముందుగా మీ ఐటీర్ వెరిఫై అయిందని నిర్ధారించుకోవాలి. "పన్ను రిటర్న్ యొక్క ధృవీకరణ , ప్రాసెసింగ్ తర్వాత మాత్రమే ఆదాయపు పన్ను రీఫండ్ జారీ చేస్తారు. ఇది ప్రత్యేకంగా ఏ సంవత్సారానికో వెల్లడించలేదు. అందుకే రీఫండ్ విలువ రూ. 5 లక్షల రూపాయల వరకు ఉంటే పెండింగ్లో ఉన్న అన్ని రీఫండ్లను ప్రాసెస్ చేస్తుందని అనుకోవచ్చు.
ఐటీఆర్ ప్రాసెసింగ్ ప్రక్రియ
"పన్ను చెల్లింపుదారుడు దాఖలు చేసిన రిటర్న్ ఆన్లైన్ ద్వారా లేదా సంతకం చేసిన ఐటిఆర్ ధృవీకరణ ఫారం హార్డ్ కాపీని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) కు పంపడం ద్వారా ధృవీకరించవచ్చ. తర్వాత, సీపీసీ ఆటోమేటెడ్ యంత్రాంగం ద్వారా ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రక్రియలో, ఫారం 16 డేటా, ఫారం 26 ఎఎస్ లోసరిపోలేలా ఉంటే, ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 143 (1) ప్రకారం పన్ను చెల్లించడం లేదా రీఫండ్ సమాచారం తెలియజేస్తుంది. పన్ను చెల్లింపుదారులు , ఆదాయపు పన్ను శాఖ లెక్కించినట్లుగా పన్ను వివరణాత్మక గణాంకాలను కూడా ఈ సమాచారం అందిస్తుంది.
ఐటీఆర్ ప్రాసెస్ పూర్తయిందని ఎలా తెలుసుకోవాలి?
- ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి
- డ్యాష్బోర్డ్లో ‘View return/forms’ పై క్లిక్ చేయాలి
- ‘Income tax returns’ సెలక్ట్ చేసుకొని submit పై క్లిక్ చేయాలి
- తర్వాత ఆ ఏడాదికి సంబంధించిన ‘acknowledgement number’ పై క్లిక్ చేయాలి . అప్పుడు మీక స్టేటస్ వస్తుంది.
ఐటీఆర్ ప్రాసెస్ కాకపోతే ఏం చేయాలి?
ఐటీఆర్ ప్రాసెస్ చేయకపోతే, పన్ను చెల్లింపుదారుడు ఆదాయపు పన్ను పోర్టల్లో తన ఖాతాలో ఆన్లైన్లో సీపీసీ / అసెసింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు పిటిషన్ను దాఖలు చేయవచ్చు, పన్ను రిటర్న్ ప్రాసెసింగ్ను వేగవంతం చేయమని పన్ను శాఖను అభ్యర్థించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ