ఈపీఎఫ్ మొత్తాన్ని ఆన్లైన్లో బదిలీ చేయడం ఎలా?
ఉద్యోగం మారిననప్పుడు సంస్థ కొత్త ఈపీఎఫ్ ఖాతాను తెరిచినప్పటికీ యూఏఎన్ నెంబరులో మార్పు ఉండదు....
Updated : 01 Jan 2021 17:22 IST
ఉద్యోగి భవిష్య నిధి(ఈపీఎఫ్) అనేది పొదుపు పథకం, పన్ను మినహాయింపుతో కూడిన రాబడిని అందిస్తుంది. మీరు ఈపీఎఫ్ ఖాతాదారులా? ఉద్యోగం మారుతున్నారా? మీ పాత ఈపీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్సు, ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థ కొత్త ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. మీరు ఉద్యోగం మారినప్పుడు కొత్త సంస్థలో కొత్త ఈపీఎఫ్ ఖాతా తెరుస్తారు. అయితే యూనివర్సల్ అక్కౌంట్ నెంబర్(యూఏఎన్)లో మార్పు ఉండదు. 1952లో ప్రభుత్వం ఈపీఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో పొదుపు చేయడం తప్పనిసరి చేసింది. ఉద్యోగి, సంస్థలు రెండు క్రమానుగుణంగా ఈపీఎఫ్కి కాంట్రీబ్యూట్ చేయాలి. ఈ పథకం కింద కొన్ని కంపెనీలు వాటి సొంత పీఎఫ్ ట్రస్ట్లు నడుపుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఒకవేళ మీ సంస్థ కూడా సొంతంగా పీఎఫ్ ట్రస్టును నిర్వహిస్తుంటే పాత సంస్థలో పీఎఫ్ బ్యాలెన్సును కొత్త సంస్థకు మార్చుకోవడం సాధ్యంకాదు.
పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు ఆన్లైన్ ద్వారా ఈపీఎఫ్ను బదిలీ చేసుకునే విధానం:
- ముందుగా మీ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్లను ఉపయోగించి ఈపీఎఫ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
- ఎడమ వైపున ఉన్న ఆన్లైన్ సర్వీసెస్కు వెళ్ళాలి
- అందులో ఒన్ మెంబర్ - ఒన్ ఈపీఎఫ్ ఖాతా బదిలీ అభ్యర్థనను ఎంచుకోవాలి.
- మీ యూఏఎన్ లేదా పాత ఈపీఎఫ్ సభ్యత్వ ఐడీని మరొకసారి ఎంటర్ చేస్తే, మీ ఖాతా వివరాలు కనిపిస్తాయి.
- మీ ప్రస్తుత, పాత సంస్థలలో దేని నుంచి బదిలీ చేయాలనుకుంటున్నారో తెలియజేయాలి.
- ఇందులో నుంచి పాత ఖాతాను ఎంచుకుంటే ఓటీపీ(ఒన్టైమ్ పాస్వర్డ్) జనరేట్ అవుతుంది.
- ఒకసారి మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత, ఆన్లైన్ ద్వారా బదిలీ ప్రాసెస్ అభ్యర్థన మీ సంస్థకు చేరుతుంది.
- ఆన్లైన్ సర్వీసెస్ మెనూలోని ‘ట్రాక్ క్లెయిమ్ స్టేటస్’ ఆప్షన్ ద్వారా మీ ఈపీఎఫ్ బదిలీ స్థితిని తెలుసుకోవచ్చు.
- ఆఫ్లైన్ ద్వారా బదిలీ చేసేందుకు పాత లేదా ప్రస్తుత సంస్థకు ఫారమ్13ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
- ఈపీఎఫ్ఓ అందించే ఆన్లైన్ సౌకర్యం ద్వారా సభ్యులు పీఎఫ్ చివరి సెటిల్మెంటు, పెన్షన్ విత్డ్రా, పీఎఫ్ పాక్షిక విత్డ్రాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Tags :
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM