హ్యుందాయ్ - ఎస్‌యూవీ అల్కాజ‌ర్‌

మే నెల ప్రారంభంలో భార‌త‌దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు

Updated : 10 Apr 2021 16:34 IST

ద‌క్షిణ కొరియాకు చెందిన ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ హ్యుందాయ్, అల్కాజార్ పేరుతో, మూడు వ‌రుస‌ల సీట్ల‌తో స‌రికొత్త‌ ఎస్‌యూవీని భార‌త‌దేశంలో ఆవిష్క‌రించ‌నుంది. ఇటీవ‌లి కాలంలో 6/7 సీట్ల ఎస్‌యూవీపై కొనుగోలుదారులు ఆశ‌క్తి చూప‌డంతో, కంపెనీ ఈ విభాగంపై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తుంది. 

హ్యుందాయ్ అల్కాజర్  ఫీచ‌ర్లు..

* అల్కాజ‌ర్ పేరుతో ఈ స‌రికొత్త కారు స్పోర్ట్స్ యుటిలిటీ వెహిక‌ల్‌(ఎస్‌యూవీ) విభాగంలో క్రేటా వెర్ష‌న్‌లో మూడు వ‌రుస‌ల సీట్లతో వ‌స్తుంది
* భిన్న‌మైన గ్రిల్‌తో,  అద‌న‌పు పొడ‌వుతో (2,760 మిమీ వీల్‌బేస్), క్రేటాకు రీడిజైన్ చేస్తున్నారు.
* ఇది రెండు ఇంజ‌న్ల‌తో వ‌స్తుంది.159 పిఎస్ 2.0-లీటర్ పెట్రోల్, 15 పిఎస్ డీజిల్, రెండూ ఇంజ‌న్ల‌కు 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌ను అందించారు. 
* ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అందిస్తున్నారు. 
* అల్కాజ‌ర్ 6,7 సీట్ల లేఅవుట్‌తో.. మధ్య‌ వ‌ర‌సులో కెప్టెన్ సీట్లు ఉండ‌డం వ‌ల్ల ప్ర‌యాణం చేసే వారికి సౌక‌ర్య‌వంతంగా ఉండ‌నుంది. 
‌* మే నెల ప్రారంభంలో భార‌త‌దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు హ్యూందాయ్ తెలిపింది. దీని ఎక్స్ షోరూమ్ ధ‌ర రూ.13 ల‌క్ష‌ల నుంచి రూ.20 వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని