ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్.. ఆ ఛార్జీల పెంపు!
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఛార్జీలను ఆ బ్యాంకు సవరించింది. పెంచిన ఛార్జీలను ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి తీసుకురానుంది.
దిల్లీ: క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఛార్జీలను ఆ బ్యాంకు సవరించింది. పెంచిన ఛార్జీలను ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు ఇప్పటికే వినియోగదారులకు ఆ బ్యాంకు సందేశాలు పంపిస్తోంది. ఇకపై క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం కేంద్రాల నుంచి నగదు తీసినా, ఆలస్యంగా బిల్లు మొత్తం చెల్లించినా వినియోగదారులపై భారీగా భారం పడనుంది.
అత్యవసర సందర్భాల్లో క్రెడిట్ కార్డు ఉపయోగించి నగదు తీస్తుంటారు కొందరు. అలా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి లావాదేవీ చేసే వారు ఇకపై భారీగా మూల్యం చెల్లించాల్సిందే. ఇలా తీసిన మొత్తంపై అన్ని కార్డులపై 2.50 శాతం చొప్పున ఇకపై ఫీజుగా వసూలు చేయనున్నారు. కనీసం రూ.500 చొప్పున వసూలు చేస్తామని ఐసీఐసీఐ పేర్కొంది. అలాగే చెక్ రిటర్న్ అయినా, ఆటో డెబిట్ ఫెయిల్ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం ఇకపై వసూలు చేస్తారు. కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
ఏదైనా సందర్భంలో క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లించినా భారీగా వాత తప్పదు. బిల్లు మొత్తం రూ.100లోపు ఉంటే ఎటువంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే మొత్తం రూ.100-500 మధ్య అయితే రూ.100; రూ.501-5000 మధ్య అయితే రూ.500; రూ.5001- 10వేలు అయితే రూ.750; రూ.10001-25వేల వరకు రూ.900; రూ.25,001 నుంచి రూ.50వేల వరకు రూ.1000; రూ.50వేలు పైన ఎంతమొత్తమైనా రూ.1200 ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలన్నింటికీ మరో రూ.50+ జీఎస్టీ చెల్లించాలని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. ఎమరాల్డ్ క్రెడిట్ కార్డులకు ఆలస్య రుసుము ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది. అయితే, సకాలంలో బిల్లులను చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలూ ఉండవు. ఆలస్యంగా చెల్లింపులు చేయడం, ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బులు డ్రా చేయడం వంటివి చేసే వారికి మాత్రం ఈ రుసుములు వర్తిస్తాయి. ఈ భారం పడకూడదనుకుంటే.. క్రెడిట్ కార్డు వాడే విషయంలో అప్రమత్తంగా ఉండండి. నిర్దేశించిన గడువులోగా చెల్లింపులు చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్