బోగస్ రిఫండ్ క్లెయిమ్స్ పై చర్యలు ప్రారంభించిన ఆదాయ పన్ను శాఖ
బోగస్ పెట్టుబడులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సీబీడీటీ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. పన్ను చెల్లింపు ఫారమ్స్ లో చూపిన మోసపూరిత పెట్టుబడులకు సంబంధించిన బోగస్ రిఫండ్ క్లెయిమ్స్ ను..
బోగస్ పెట్టుబడులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సీబీడీటీ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. పన్ను చెల్లింపు ఫారమ్స్ లో చూపిన మోసపూరిత పెట్టుబడులకు సంబంధించిన బోగస్ రిఫండ్ క్లెయిమ్స్ ను నిరోధించడానికి ఆదాయ పన్ను శాఖ అదనపు తనిఖీలను ప్రవేశపెట్టిందని సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఛైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. ఇలాంటి పెట్టుబడులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సీబీడీటీ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజలు బోగస్ రీఫండ్స్ ను క్లెయిమ్ చేసుకోవడం చాలా బాధాకరమైన విషయమని, ప్రజలు ఇటువంటి ఆలోచనలను మానుకుని, తమ పన్నులకు సంబంధించిన సరైన వాటాను నిజాయితీగా చెల్లించే సమయం ఇదేనని చంద్ర తెలిపారు. ముంబై, బెంగళూరుతో పాటు, పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలలో జరిగిన సెర్చ్ ఆపరేషన్లలో, కొంతమంది మోసగాళ్లు పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించి, సెక్షన్ 80సీ కింద కల్పిత పెట్టుబడులు, గృహ రుణాలను ఆధారంగా చేసుకుని రీఫండ్స్ ను క్లెయిమ్ చేస్తున్నారని ఆదాయ పన్ను శాఖ తెలుసుకుంది. అలాగే కేవలం ఒక ఐపీ అడ్రస్ నుంచే చాలా రీఫండ్ క్లెయిమ్స్ ధాఖలైనట్లు కూడా ఆదాయ పన్ను శాఖ కనుగొనింది. ఒకవేళ ఏవైనా మోసపూరిత రిటర్న్ లు ధాఖలైనప్పుడు, సదరు రిఫండ్ ను నిలిపివేసేలా వ్యవస్థలో మార్పులు చేసినట్లు చంద్ర తెలిపారు.
“హై పిచ్డ్” అస్సెస్మెంట్ కు సంబంధించిన అంశాల గురించి చంద్ర ప్రస్తావిస్తూ, అటువంటి కేసులను పరిశీలించేందుకు సీబీడీటీ ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. అనేక మంది మా వద్దకు వచ్చి మా అస్సెస్మెంట్ చాలా “హై పిచ్డ్” అని చెప్పడం వలన మేము ముగ్గురు ప్రధాన కమిషనర్లతో ‘హై-పిచ్డ్’ అసెస్మెంట్ కమిటీని నియమించాము, ఒకవేళ మీ అస్సెస్మెంట్ “హై పిచ్డ్” అని మీరు భావించినట్లైతే, మీరు కమిటీని సంప్రదించవచ్చునని చంద్ర తెలిపారు.
ఒకవేళ అస్సెస్మెంట్ ను కమిటీ “హై పిచ్డ్” అని నిర్ణయించినట్లైతే, అస్సెస్మెంట్ అధికారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా డిమాండ్ చేయవచ్చు. గత ఏడాది, మేము “హై పిచ్డ్” అస్సెస్మెంట్లలో పాలుపంచుకున్న 12 కంటే ఎక్కువ మంది అస్సెస్మెంట్ అధికారులను బదిలీ చేశామని చంద్ర తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్