వేతనాలు పెంచి.. 5,300% వృద్ధి సాధించి!
సాధారణంగా ఓ కంపెనీ అనుకున్న స్థాయిలో రాణిస్తేనే యాజమాన్యం తమ ఉద్యోగుల వేతనాలను పెంచుతుంది. తద్వారా సంస్థ లాభాలు ఆర్జించడంలో ఉద్యోగుల కృషిని గుర్తించి వారికి....
ఓ సక్సెస్ఫుల్ సీఈఓ బిజినెస్ మోడల్ ఇది
ఇంటర్నెట్ డెస్క్
సాధారణంగా ఓ కంపెనీ అనుకున్న స్థాయిలో రాణిస్తేనే యాజమాన్యం తమ ఉద్యోగుల వేతనాలను పెంచుతుంది. తద్వారా సంస్థ లాభాలు ఆర్జించడంలో ఉద్యోగుల కృషిని గుర్తించి వారికి తగిన ప్రతిఫలాన్ని వేతన రూపంలో అందజేస్తుంది. మరి అనుకున్న మేర రాణించకపోతే వేతన పెంపునకు వేచి చూడాల్సిందే. కానీ, జపాన్కు చెందిన ఫిఫ్ట్ కంపెనీ సీఈఓ మసారు తంగే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దాంట్లో ఆయన విజయం కూడా సాధిస్తున్నారు. అదెలాగో చూద్దాం..!
ఎక్కవ మంది ఉద్యోగులకు ఆకర్షించడం...
మసారు తంగే స్థాపించిన షిఫ్ట్ అనేది ఓ సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంస్థ. ఈ రంగంలో అట్లడుగున ఉన్న చిన్న కంపెనీలను మసారు కొనుగోలు చేస్తుంటారు. అందులో పనిచేసే ఇంజినీర్ల వేతనాలు పెంచుతారు. దీంతో ఎక్కువ మంది తన సంస్థలో పనిచేసేందుకు ఆసక్తి కనబరిచేలా చేస్తారు. సాధారణంగా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీ నుంచి ఉత్పత్తి కూడా ఎక్కువే ఉంటుంది. అయితే, ఎక్కువ మంది ఉద్యోగులు, అధిక వేతనాలు అంటే ఆదాయం కూడా ఎక్కువే ఉండాలి. అంటే క్లయింట్ల నుంచి వసూలు చేసే సొమ్ము కూడా అధికంగా ఉండాలి కదా! కానీ, ఈ విషయంలోనే తంగే తన వ్యూహానికి పదును పెట్టారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా...
మార్కెట్లో ఇతర కంపెనీలు వసూలు చేస్తున్న ధర కంటే తంగే ఏమాత్రం ఎక్కువ తీసుకునేవారు కాదు. కానీ, క్లయింట్లకు, సంస్థకు మధ్య ఉన్న మధ్యవర్తులను పూర్తిగా తొలగించేశారు. దీంతో ఖర్చు తగ్గి ఆదాయం పెరిగింది. పైగా ఎక్కువ మంది ఉద్యోగులు ఉండడం వల్ల ఉత్పత్తి కూడా ఎక్కవే ఉండేది. దీంతో ఎక్కువ మంది క్లయింట్లకు సేవలందించేవారు. ఆ రకంగానూ మునుపటి కంటే అధిక ఆదాయం సమకూరేలా చూశారు. ఇలా కంపెనీలో ఉన్న ఉద్యోగుల వేతనాలు పెంచి ఆ సంస్థ పనితీరును పరుగులు పెట్టించడమే తంగే వ్యూహం.
షేరు విలువలో 5,300% వృద్ధి...
2014లో తొలిసారి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పపటి నుంచి షిఫ్ట్ షేరు విలువ 5,300 శాతం పెరిగింది. టోక్యో బెంచ్మార్క్ స్టాక్ ఇండెక్స్లో అత్యంత మెరుగైన వృద్ధి సాధించిన కంపెనీల్లో షిఫ్ట్ది రెండో స్థానం. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ 2.3 ట్రిలియన్ డాలర్లు. దీంతో కంపెనీలో 33 శాతం వాటాలు ఉన్న తంగే సంపద 745 మిలియన్ డాలర్లకు చేరింది.
యువ ఉద్యోగులకు ప్రోత్సాహం...
జపాన్ సాఫ్ట్వేర్ పరిశ్రమలో ఉన్న పలు దశల సబ్కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు, ఏజెన్సీలు వచ్చిన ఆర్డర్లలో కొంత కమీషన్గా తీసుకొని సంస్థలకు ప్రాజెక్టులు అప్పగిస్తున్నాయని తంగే తెలిపారు. ఈ వ్యవస్థను నిర్మూలించి వ్యయాన్ని తగ్గించడమే తన బిజినెస్ మోడల్ అని వివరించారు. అలాగే విలీనం, కొనుగోళ్ల ద్వారా ఆయా సంస్థల్లో పనిచేసే యువ ఉద్యోగులకు మంచి పని వాతావరణం కల్పించి ప్రోత్సహించాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని పేర్కొన్నారు.
మెకానికల్ ఇంజినీరింగ్లో పట్టా పుచ్చుకున్న తర్వాత తంగే ఐదు సంవత్సరాల పాటు ఓ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేశారు. అనంతరం 2005లో షిఫ్ట్ పేరిట ఓ సలహా సంస్థను స్థాపించారు. ఆయా కంపెనీలకు తమ లాభాల్ని ఎలా పెంచుకోవాలో వ్యూహాలందించడమే దీని పని. అనంతరం ఇది సాఫ్ట్వేర్ టెస్టింగ్ కంపెనీగా రూపాంతరం చెందింది. సాఫ్ట్వేర్ టెస్టింగ్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు సైతం అధిక వేతనాలు చెల్లించి ఈ రంగంపై ఉన్న చిన్నచూపును తొలగించేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్