Inequality: భారత్లో పెరుగుతున్న ఆదాయ అసమానతలు!
భారత్లో ఆదాయపరమైన అసమానతలు పెరిగిపోతున్నట్లు వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. 2021 జాతీయ ఆదాయంలో ఐదో వంతు కేవలం ఒక శాతం మంది దగ్గరే ఉన్నట్లు తెలిపింది...
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో ఆదాయపరమైన అసమానతలు పెరిగిపోతున్నట్లు వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. 2021 జాతీయ ఆదాయంలో ఐదో వంతు కేవలం ఒక శాతం మంది దగ్గరే ఉన్నట్లు తెలిపింది. ఇక ధనవంతుల జాబితాలో ఉన్న తొలి 10 శాతం మంది చేతిలో 57 శాతం ఆదాయం ఉన్నట్లు పేర్కొంది. భారత్లో వయోజనుల సగటు తలసరి ఆదాయం రూ.2,04,200గా ఉందని తెలిపింది.
సంపదలోనూ అసమానతలు తీవ్రంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. సంపద విషయంలో కిందనున్న 50 శాతం కుటుంబాల వద్ద అసలేమీ లేదని పేర్కొంది. మధ్య తరగతి వారి వద్ద 29.5 శాతం సంపద ఉందని వెల్లడించింది. అదే పైన ఉన్న 10 శాతం మంది వద్ద 65 శాతం, 1 శాతం మంది దగ్గర 33 శాతం సంపద ఉన్నట్లు తెలిపింది. మధ్యతరగతి వారి వద్ద సగటున రూ.7,23,930ల సంపద ఉన్నట్లు నివేదించింది. అదే పైన ఉన్న 10 శాతం మంది దగ్గర సగటున రూ.63,54,070, ఒక శాతం మంది వద్ద రూ.3,24,49,360 సంపద ఉన్నట్లు తెలిపింది.
1985 తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక విధానాలు ఆదాయ, సంపద విషయంలో అసమానతల్ని పెంచాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పైన ఉన్న ఒక శాతం మంది ఆర్థిక సంస్కరణల వల్ల భారీ లబ్ధి పొందారని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు