Stock Market: ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం ఊగిసలాట ధోరణిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగానే

Published : 09 Dec 2021 09:49 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం ఊగిసలాట ధోరణిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగానే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. కానీ దేశీయంగా దిగ్గజ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఒత్తిడికి గురవుతున్నాయి. దీంతో లాభాలను కోల్పోయిన మార్కెట్లు.. నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 31 పాయింట్ల నష్టంతో 58,618, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 17,459 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. రియల్టీ, లోహ, బ్యాంకింగ్‌, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని