ఆర్థిక సలహాదారులు రూ.1.25 లక్షల వరకు ఫీజు తీసుకోవచ్చు
సెబీ మార్గదర్శకాల ప్రకారం.. కొత్త క్లయింట్లు పంపిణీ, సలహా సేవలను ఎంచుకోవలసి ఉంటుంది..........
సెబీ మార్గదర్శకాల ప్రకారం.. కొత్త క్లయింట్లు పంపిణీ, సలహా సేవలను ఎంచుకోవలసి ఉంటుంది
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నమోదిత ఆర్థిక సలహాదారులు (ఆర్ఏఐ) వసూలు చేసే ఫీజులకు పరిమితులను పెంచుతూ నిర్ణయం వెల్లడించింది. వారి సలహామేరకు చేసే పెట్టుబడుల్లో 2.5 శాతం మాత్రమే లేదా ఫ్లాట్గా ఫీజు వసూలు చేస్తుంటే రూ.1,25,000 కి ఛార్జీలు వసూలు చేయాలని సూచించింది.
150 మందికి పైగా క్లయింట్లతో ఉన్న సలహాదారులు సెబీ తుది మార్గదర్శకాల ప్రకారం వారి అభ్యాసాన్ని కార్పొరేట్ చేయాలి, కొత్త క్లయింట్లను తీసుకోవడం నిలిపివేయాలి. దీనిని మొదట జనవరిలో ప్రతిపాదించడగా జులైలో అందుబాటులోకి తెచ్చింది.
సెబీ నిర్దేశించిన నిబంధనలను కలుపుకొని, ఏప్రిల్ 1, 2021 నాటికి ఆర్ఏఐ ఖాతాదారులతో కొత్త పెట్టుబడి సలహా ఒప్పందాలపై సంతకం చేయాలి. ప్రస్తుత క్లయింట్లు ఒక సమూహం లేదా కుటుంబ స్థాయిలో ఆర్ఐఏల సలహా లేదా పంపిణీ సేవలను ఎంచుకోవచ్చు. కొత్త క్లయింట్లు కూడా పంపిణీ, సలహా సేవల మధ్య ఎన్నుకోవలసి ఉంటుంది.
జనవరిలో ప్రతిపాదించిన రూ. 75,000 నుంచి, ఫీజు పరిమితిని రూ.1,25,000 వరకు వసూలు చేసేందుకు సెబీ ఆర్ఐఏలకు అనుమతినిచ్చింది. మరోవైపు పెట్టుబడి పెడుతున్న నికర ఆస్తి విలువలో 2.5 శాతం ఫీజుగా తీసుకోవచ్చు. అయితే వ్యక్తిగతంగా క్లయింట్ల ఆర్థిక స్థితిపై ఆధారపడి ఫీజులో వెసులుబాటు చేసుకోవచ్చు. కానీ గరిష్ఠ పరిమితి, సెబీ నిర్ణయించిన మొత్తంలోపే ఉండాలి.
సెబీ ప్రతిపాదించిన అర్హత పరిమితులకు ఆర్ఐఏలు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి. సలహాదారులకు పోస్ట్-గ్రాడ్యుయేట్ అర్హతలు, ఐదేళ్ల అనుభవం, పెట్టుబడి సలహా ఇచ్చేవారికి రెండు సంవత్సరాలు వంటివి అవసరం. ఏదేమైనా, ఇప్పటికే ఉన్న ఆర్ఐఏలు 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు అయితే సేవలను అందించడానికి NISM- గుర్తింపు పొందిన ధృవపత్రాలను కలిగి ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా