Jio Offer: జియోలో రూపాయి రీఛార్జ్ ప్యాక్.. ఎంత డేటా వస్తుందంటే?
జియో సంస్థ రూపాయి రీఛార్జ్ ప్యాక్ను యూజర్స్కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్తో యూజర్స్ 30 రోజుల వ్యాలిడిటీతో 100 ఎంబీ డేటా పొందుతారు.
ఇంటర్నెట్డెస్క్: ఒక రూపాయికి ఏమొస్తుంది అంటే.. సమాధానం చాక్లెట్ లేదా బిస్కెట్ అని వినిపిస్తుంది. కానీ, జియో కంపెనీ మాత్రం 100 ఎంబీ డేటా వస్తుంది అని అంటోంది. అవును..నిజం, జియో కంపెనీ తమ వినియోగదారుల కోసం ఈ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక రూపాయితో రీఛార్జ్ చేసుకొని 30 రోజుల వ్యాలిడిటీతో 100 ఎంబీ డేటాను పొందొచ్చని తెలిపింది. ఒకవేళ డేటా పరిమితి ముగిసిపోతే డేటా వేగం 64కేబీపీఎస్కు తగ్గతుందని జియో సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకూ జియో అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్లలో తక్కువ ధర కలిగింది ఇదే కావడం గమనార్హం.
రీఛార్జ్ ఎలా చేయాలంటే?
ఒక రూపాయి రీఛార్జ్ చేయాలనుకునే యూజర్స్ ‘మై జియో’ యాప్లోకి వెళ్లాలి. అందులో ‘అదర్స్’లో వాల్యూ అనే సెక్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో మీకు రూపాయి రీఛార్జ్ ప్యాక్ కనిపిస్తుంది. ఒకవేళ యూజర్స్ 500 ఎంబీ డేటా కావాలంటే 5 సార్లు, 1జీబీ డేటా కావాలనుకుంటే పది సార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే గరిష్టంగా ఎన్నిసార్లు రీఛార్జ్ చేయవచ్చనే దానిపై మాత్రం స్పష్టత లేదు.
ఇటీవలే జియోతో సహా అన్ని టెలికాం సంస్థలు ప్రీపెయిడ్ ఛార్జీలను 20 శాతం మేర పెంచాయి. గతవారం జియో రూ. 119 రీఛార్జ్ ప్లాన్ను సవరించింది. ఇందులో రోజువారీ 300 ఎస్సెమ్మెస్లతోపాటు, 1.5జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ ఇస్తున్నట్లు తెలిపింది. అయితే ఇవే బెనిఫిట్లను రూ. 98 ప్లాన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే రూ. 98 ప్లాన్ కాలపరిమితి 14 రోజులు కాగా, రూ. 119 కాలపరిమితి 28 రోజులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?