స్పేస్ఎక్స్కు నాసా కీలక కాంట్రాక్టు
ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్కు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక కాంట్రాక్టు అప్పగించింది. 2024 నాటికి చంద్రుడిపైకి మానవసహిత యాత్రకు కావాల్సిన ల్యాండర్ను.....
వాషింగ్టన్: ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్కు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక కాంట్రాక్టు అప్పగించింది. దీని విలువ 2.9 బిలియన్ డాలర్లు. 2024 నాటికి చంద్రుడిపైకి మానవసహిత యాత్రకు కావాల్సిన ల్యాండర్ను స్పేస్ఎక్స్ రూపొందించాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అమెజాన్ సహవ్యవస్థాకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్, డైనెటిక్స్ కూడా పోటీ పడగా.. నాసా స్పేస్ఎక్స్ వైపే మొగ్గుచూపింది.
స్టార్షిప్ పేరిట రూపొందించనున్న ఈ ల్యాండర్లో ఓ క్యాబిన్తో పాటు మూన్వాక్కు కావాల్సిన రెండు ఎయిర్లాక్లు ఉంటాయి. దీన్ని పునర్వినియోగ ల్యాండర్గా రూపొందించాలనుకుంటున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహంపైకి జరపబోయే మానవ సహిత యాత్రలకు కూడా దీన్ని ఉపయోగించాలని భావిస్తున్నారు.
ఆర్టెమిస్ పేరిట నాసా చేపడతున్న ఈ ప్రాజెక్టులో ఒరియాన్ అనే స్పేస్క్రాఫ్ట్లో మొత్తం నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళతారు. వీరిలో ఇద్దరు స్పేస్ఎక్స్ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టం ద్వారా చంద్రుడిపై కాలు మోపుతారు. దాదాపు వారం రోజుల పాటు వారు అక్కడే గడుపుతారు. అనంతరం చంద్రుడి కక్ష్యలో ఉండే ఒరియాన్కు తిరిగొస్తారు. అప్పటి వరకు కక్ష్యలో ఉండే ఇతర ఇద్దరు వ్యోమగాములతో కలిసి తిరిగి భూమికి పయనమవుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ