kia: వినియోగదారుల సంతోషమే లక్ష్యం
భారత్లో వినియోగదారులను సంతృప్తే లక్ష్యంగా కియా ఇండియా కొత్త పథకాన్ని ప్రకటించింది. కియా కార్నివాల్
ఇంటర్నెట్డెస్క్: భారత్లో వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా కియా ఇండియా కొత్త పథకాన్ని ప్రకటించింది. కియా కార్నివాల్ ఎంపీవీపై ‘శాటిశ్ఫాక్షన్ గ్యారెంటీ స్కీమ్’ను ప్రకటించింది. పైవేటు కొనుగోలుదారులకు ఈ రకమైన పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే మొదటి సారి. దీని ప్రకారం కారును కొనుగోలు చేసిన తర్వాత దాని పనితీరుపై సంతృప్తి లభించకపోతే 30 రోజుల్లో వాపస్ చేయవచ్చు. ఈ ఆఫర్ కియా కార్నివాల్లోని అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని పేర్కొంది. ఇది ఎక్స్షోరూమ్ ధరలో 95శాతం ధరను కవర్ చేయడంతోపాటు రిజిస్ట్రేషన్, ఫైనాన్స్ ఖర్చులను కూడా భరిస్తుంది.
దీనిపై కియా ఇండియా ప్రతినిధి తాయ్ జిన్ పార్క్ మాట్లాడుతూ ‘‘గతనెల వినియోగదారులను మా ఉత్పత్తులు, సేవలతో ప్రభావితం చేసేందుకు మేము కొత్త బ్రాండును పరిచయం చేశాము. ఈ క్రమంలోనే ‘శాటిశ్ఫాక్షన్ గ్యారెంటీ స్కీమ్’ను పరిచయం చేశాము. ప్రస్తుతం సమాజంలో ఒత్తిళ్లు ఉన్న సమయంలో మా కస్టమర్లు ప్రశాంతగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది కియా కార్నివాల్పై నమ్మకాన్ని పెంచుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ ఆఫర్ వర్తించాలంటే కియా కార్నివాల్ కారును 30 రోజుల్లో 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువగా వినియోగించకూడదు. ఎటువంటి ప్రమాదాలు, క్లెయిమ్ల పెండింగ్ ఉండకూడదు. హైపతికేషన్ వంటివి కూడా ఉండకుండా ఉండాలి. ఇప్పటి వరకు కంపెనీ 6,200 కియా కార్లను విక్రయించింది. వీటిల్లో 60శాతం లిమోజిన్ వేరియంట్ కావడం విశేషం. కార్నివాల్ 7,8, 9 సీట్ల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. లిమోజిన్ వేరియంట్లో మాత్రం రెండోవరుసలో విలాసవంతమైన క్యాబిన్ సీట్లు ఉంటాయి. ఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్