మొదటి హక్కు నామినీకే..వారసులకు కాదు
నామినీ లేనప్పుడు, చట్టపరమైన వారసుడు బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు
జీవిత బీమా పాలసీదారుడు మరణించినప్పుడు క్లెయిమ్ చేసుకునేందుకు నామినీ, వారసుడి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం చాలా ముఖ్యమైన విషయం. బీమా పాలసీని మరణించిన పాలసీదారుని ఆస్తిగా పరిగణిస్తారు. దానిపై చట్టపరమైన వారసులకు హక్కు ఉంటుంది. అయితే, జీవిత బీమాలో బెనిఫీషియల్ నామినీ అనే ఒక అంశం ఉంది. ఈ నిబంధన బీమా చట్టాల (సవరణ) చట్టం, 2015 లో ప్రవేశపెట్టారు. దీనిప్రకారం జీవితబీమాలో నామినీకే బీమా పాలసీపై మొదట హక్కు ఉంటుంది. ఒకవేళ పాలసీదారుని కుటుంబ సభ్యుడి (తల్లిదండ్రులు, లేదా జీవిత భాగస్వామి లేదా పిల్లలను) నామినీగా చేస్తే, ఆదాయం ఉద్దేశించిన వ్యక్తికి వెళ్తుంది. చట్టపరమైన వారసులకు డబ్బుపై ఎటువంటి క్లెయిమ్ చేసుకునే వీలుండదు.
నామినీ లేనప్పుడు, చట్టపరమైన వారసుడు బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. దీనికోసం క్లెయిమ్ ఇంటిమేషన్ లెటర్, మరణ ధృవీకరణ పత్రం, లబ్ధిదారుడి ఐడి ప్రూఫ్, పాలసీ పేపర్స్, డిశ్చార్జ్ ఫారం (ఏదైనా ఉంటే), పోస్ట్ మార్టం రిపోర్ట్, హాస్పిటల్ రికార్డులు (అసహజ మరణం విషయంలో) వంటి ఇతర అవసరమైన డాక్యుమెంట్లతో పాటు, చట్టపరమైన వారసుడు బీమా హామీతో సహా మరణించిన పాలసీదారుడి ఆస్తులపై చట్టపరమైన వారసుడి హక్కును ఏర్పాటు చేసే సమర్థ న్యాయస్థానం జారీ చేసిన వారసత్వ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి .చట్టపరమైన వారసులు ఒకరి కంటే ఎక్కువగా ఉండి, ఒకరు మాత్రమే ఆదాయాన్ని క్లెయిమ్ చేస్తుంటే, మిగతా చట్టపరమైన వారసులందరూ అంగీకరించి, దాని కోసం బీమా సంస్థకు తమ సమ్మతిని తెలియజేయాలి.
నామినీ లేనప్పుడు లేదా నామినీ మరణించిన సందర్భంలో కొత్త నామినేషన్ కోసం అభ్యర్థించకపోతే చట్టపరమైన వారసుడు దావా వేయవచ్చు. ఒకవేళ పాలసీదారుడికి ఒకటి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే, వారందరినీ నామినేట్ చేయకపోతే, నామినీ ద్వారా మాత్రమే దావా వేయవచ్చు, బీమా సంస్థ ఆదాయాన్ని నామినీకి మాత్రమే చెల్లించాలి. ఇతర పిల్లలు తమ వాటాలకు సంబందించి కోర్టులో దావా వేయవచ్చు. కాబట్టి బీమా క్లెయిమ్ల విషయంలో స్పష్టత పొందండి, తదనుగుణంగా వ్యవహరించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇకపై ప్రతీ మ్యాచ్ మాకు సెమీఫైనల్ లాంటిది: ఆర్సీబీ హెడ్ కోచ్
-
సీఎం జగన్పై రాయి దాడి కేసులో అక్రమంగా ఇరికిస్తున్నారని ఆందోళన
-
శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్తో సాన్యా
-
సాంకేతిక తప్పిదం.. వేరే జంటకు విడాకులు!
-
ఆజాద్ వ్యాఖ్యలకు దీటుగా కాంగ్రెస్ నాలుగు ప్రశ్నలు
-
అవినాష్.. మీ ఫోన్ దర్యాప్తు అధికారికి ఇవ్వండి: వైఎస్ సునీత