అత్యవసర నిధికి ఇప్పుడు లిక్విడ్ ఫండ్లు మంచివేనా?
డబ్బు కోసం అత్యవసర లేని పెట్టుబడిదారులు ఇందులో పెట్టుబడులు కొనసాగించవచ్చు....
డబ్బు కోసం అత్యవసర లేని పెట్టుబడిదారులు ఇందులో పెట్టుబడులు కొనసాగించవచ్చు
కోవిడ్-19 అత్యవసర నిధి ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేసింది. భవిష్యత్తులో ఏమి జరుగుతుందనే దానిపై చాలా అనిశ్చితి ఉన్నందున, చాలామంది అత్యవసర నిధిలో కొంత భాగాన్ని లిక్విడ్ ఫండ్లలో పెట్టాలా లేదా మొత్తాన్ని బ్యాంక్ పొదుపు ఖాతాల వంటి సురక్షితమైన వాటికి మార్చాలా అని సందిగ్థంలో పడ్డారు. డెట్ మార్కెట్లలో లిక్విడిటీ అంతరాయాల కారణంగా ప్రత్యేకించి లిక్విడ్ ఫండ్ల ఎన్ఏవీలలో అనిశ్చితి ఏర్పడింది. మరి ఇప్పుడు లిక్విడిటీ ఫండ్లలో కొనసాగించాలా, ఉపసంహరించుకొని అత్యవసర నిధి కోసం వేరే మార్గం ఎంచుకోవాలా అనే అంశంపై నిపుణుల అభిప్రాయం తెలుసుకుందాం.
మీకు అత్యవసర నిధి ఎంత అవసరమో లెక్కించుకున్న తర్వాత దాన్ని విభజించి వేర్వేరు విభాగాల్లో పెట్టుడులు పెట్టడం మంచిది. కొంత డబ్బును ఇంట్లో నగదు రూపంలో దాచుకొని , కొంత స్వీప్ ఇన్ సదుపాయం కలిగిన బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో, లిక్విడ్ ఫండ్లలో కూడా ఉండాలి.
గతంలో చూసుకుంటే లిక్విట్ ఫండ్లలో నష్టాలు ఎక్కువ కాలం కొనసాగలేదు. అత్యవసర నిధి అనేది ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు ఉపయోగపడేలా ఉండాలి. అత్యవసర నిధికి ముఖ్యంగా భద్రత, లిక్విడిటీ అవసరం. కానీ, లిక్విడిటీ ఒక్కటే చూడకుండా దానిపై రాబడి వచ్చే అంశాలను కూడా పరిశీలించాలని నిపుణులు చెప్తున్నారు.
లిక్విడ్ ఫండ్లు అంటే డెట్ ఫండ్లు, అవి స్వల్పకాలికంగా 91 రోజుల్లో, కచ్చితమైన రాబడి ఇచ్చే పథకాలలో పెట్టుబడులు పెడతాయి. ఏప్రిల్లో, స్వల్ప కాలానికి, మనీ మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి ఎదురైంది, లిక్విడ్ ఫండ్లు ప్రతికూల రాబడిని ఇచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) జోక్యం చేసుకుని ఒత్తిడిని తగ్గించడానికి లిక్విడిటీని ప్రవేశపెట్టింది. 2008 లో ప్రపంచ సంక్షోభం సమయంలో మేము చివరిసారిగా ఇలాంటి ఒత్తిడిని చూశామని నిపుణులు చెప్తున్నారు.
లిక్విడ్ ఫండ్లు అత్యవసర నిధికి అనువైన సాధనంగానే నిపుణులు భావిస్తున్నారు. కేవలం ఒక సంఘటనతో నిర్ణయాలు మార్చుకోకుండా గత ట్రాక్ రికార్డులను పరిశీలించాలి. లిక్విడ్ ఫండ్లలో సులభ ద్రవ్యత, పొదుపు బ్యాంక్ ఖాతాల కంటే మెరుగైన రాబడిని పొందగల సామర్థ్యం కోసం ఇది ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఇటీవల లిక్విడిటీ లోపంతో అస్థిరత ఏర్పడిన మాట నిజమే. ఇది తగినంత ఆర్థిక సహాయం లేని నిధులపై కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. విముక్తి కోసం నిధులు సమకూర్చడానికి వారి మాతృ సంస్థల నుంచి రుణం తీసుకోవచ్చు కాబట్టి అస్థిరతను అధిగమించడానికి బ్యాంక్-మద్దతుగల ఏఎంసీలు లు మంచి స్థానంలో ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. డబ్బు కోసం అత్యవసర లేని పెట్టుబడిదారులు ఇందులో పెట్టుబడులు కొనసాగించవచ్చు.
ఆర్బిఐ చర్యలు బాండ్ల రాబడికి సహాయపడ్డాయి. టిఎల్టిఆర్ఓ 1.0 కింద రూ. 1 ట్రిలియన్లు ప్రవేశపెట్టడంతో బాండ్ మార్కెట్లో అస్థిరతను తగ్గించింది, లిక్విడ్ ఫండ్ రాబడిని స్థిరీకరించింది. ఆర్థిక వ్యవస్థను స్థిరంగా, లిక్విడిటీకి ఆర్బీఐ హామీ ఇచ్చింది.
కోవిడ్-19 కారణంగా అన్ని మార్కెట్లు, ఫండ్లలో కూడా అస్థిరత ఏర్పడింది. ఇది ఎక్కువకాలం ఉండకపోవచ్చు. అందుకే లిక్విడిటీ ఫండ్లలో పెట్టుబడులు కొనసాగించడమే మంచిదని దీని సారాంశం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రుణం కోసం.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్