ధరలపై మహీంద్రా దృష్టి

ఉక్కు సహా పలు కమొడిటీ ధరలు ఇటీవల భారీగా పెరగడంతో, తీసుకోవాల్సిన చర్యలపై దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా దృష్టి పెట్టింది.

Published : 10 May 2021 01:39 IST

దిల్లీ: ఉక్కు సహా పలు కమొడిటీ ధరలు ఇటీవల భారీగా పెరగడంతో, తీసుకోవాల్సిన చర్యలపై దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా దృష్టి పెట్టింది. కొన్ని రోజుల్లోనే హాట్‌ రోల్డ్‌ కాయిల్‌, కోల్డ్‌ రోల్డ్‌ కాయిల్‌ ధరలను దేశీయ ఉక్కు సంస్థలు వరుసగా టన్నుకు రూ.4000, రూ.4,500 చొప్పున పెంచాయి. ధరల సవరణ తర్వాత టన్ను హాట్‌ రోల్డ్‌ కాయిల్‌ ధర రూ.67,000, టన్ను కోల్డ్‌ రోల్డ్‌ కాయిల్‌ ధర రూ.80000కు చేరాయి. మే మధ్యలో లేదా జూన్‌ ప్రారంభంలో వీటి ధరలు టన్నుకు మరో రూ.2000- 4000 వరకు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ముడివస్తువుల ధరలు పెరగడంతో టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ వంటి సంస్థలు ఇప్పటికే కార్ల ధరలను పెంచాయి. ఏప్రిల్‌లోనే కార్ల ధరలను పెంచామని, ఇప్పుడు ముడివస్తువుల ధరలు పెరగడంతో వ్యయాల నిర్వహణ సహా ఇతర అవకాశాలపై దృష్టి పెట్టామని మహీంద్రా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఆటోమోటివ్‌ విభాగం) వీజే నక్రా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని