​​​​మెక్‌ డొనాల్డ్స్‌ సమాచారం హ్యాక్‌!

పెద్ద పెద్ద కంపెనీలే లక్ష్యంగా హ్యాకింగ్‌ పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు మరో ప్రముఖ కంపెనీని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద బర్గర్‌ చైన్‌ మెక్‌డొనాల్డ్స్‌.

Published : 11 Jun 2021 21:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెద్ద పెద్ద కంపెనీలే లక్ష్యంగా హ్యాకింగ్‌ పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు మరో ప్రముఖ కంపెనీని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద బర్గర్‌ చైన్‌ మెక్‌డొనాల్డ్స్‌ కార్పొరేషన్‌కు చెందిన సమాచారం హ్యాకింగ్‌ గురైందని ఆ కంపెనీ వెల్లడించింది. అమెరికా, కొరియా, తైవాన్‌కు వ్యాపార కార్యకలాపాలకు చెందిన సమాచారం తస్కరణకు గురైనట్లు పేర్కొంది. కంపెనీకి చెందిన అంతర్గత భదత్రలో అనధికారిక కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు ఇటీవల నియమించుకున్న కన్సల్టెంట్ల జరిపిన పరిశోధనలో ఈ విషయం బహిర్గతం అయినట్లు కంపెనీ పేర్కొంది.

అయితే, ఇది రాన్సమ్‌వేర్‌ తరహాదాడి కాదని కంపెనీ పేర్కొంది. తస్కరణకు గురైన సమాచారంలో కస్టమర్ల వ్యక్తిగత సమాచారంతో పాటు, కొంతమంది ఉద్యోగుల సమాచారం కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని నియంత్రణ సంస్థలతో పాటు, వినియోగదారులకు కూడా తెలియపరుస్తామని తెలిపింది. వినియోగదారుల పేమెంట్స్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం బహిర్గతం కాలేదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని