ఇక పేపర్లెస్గా పాస్పోర్ట్ దరఖాస్తు
గత 6 సంవత్సరాల్లో పాస్పోర్ట్ సంబంధిత సేవల్లో చాలా మెరుగుదల ఉందని ఎంఈఏ తెలిపింది
కేంద్ర విదేశాంగ మంత్రి వి.మురళీధరన్ ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు, దీని ద్వారా పాస్పోర్ట్ కోసం ఎక్కడైనా దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాల కోసం డిజిలాకర్ను అనుమతించింది. డిజిలాకర్లో ఉన్న డాక్యుమెంట్లను దృవీకరణ కోసం ఉపయోగించవచ్చు.
డిజిలాకర్ పత్రాలకు లింక్: ఈ కొత్త సదుపాయంతో, పాస్పోర్ట్ దరఖాస్తుదారులు డిజిలాకర్ ద్వారా అవసరమైన వివిధ పత్రాలను డిజిలాకర్ ద్వారా కాగితరహిత విధానంలో సమర్పించగలుగుతారు. అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఏ) తెలిపింది. డిజిటల్ ఇండియా లక్ష్యంలో భాగంగా డిజిలాకర్ ఒక కీలకమైన చొరవ. ఇది ఎక్కడైనా అవసరమైన డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో అందించి మీ వివరాలను దృవీకరించేందుకు దోహదపడుతుంది.
కాగిత రహిత విధానం: డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిలాకర్ అనేది డిజిటల్ రూపంలో డాక్యుమెంట్లు / ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి, ధృవీకరించడానికి మంచి ప్లాట్ఫామ్. ఇది భౌతికంగా పత్రాల వాడకాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా, పాస్పోర్ట్లు కూడా డిజిలాకర్లో అప్లోడ్ చేస్తే, వినియోగదారులకు అధికారికంగా అవసరమైన వివరాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ పాస్పోర్ట్ పోతే ఇది చాలా ఉపయోగపడుతుంది. గత 6 సంవత్సరాల్లో పాస్పోర్ట్ సంబంధిత సేవల్లో చాలా మెరుగుదల ఉందని ఎంఈఏ తెలిపింది.
త్వరలో ఇ-పాస్పోర్ట్: పౌరుల కోసం ఇ -పాస్పోర్ట్ను రూపొందించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది, ఇది భద్రతను పెంచుతుంది, విదేశీ విమానాశ్రయాలలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియల సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. రాబోయే పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ వి2.0 లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల ఉపయోగం , చాట్-బోట్, అనలిటిక్స్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) మొదలైనవి పాస్పోర్ట్ సేవలను సులభతరం చేయడానికి , వేగవంతమైన సేవలకు సహాయపడతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)