Ola electric scooter factory: ఆమె చేతిలో ‘ఓలా ఫ్యూచర్’
నిర్మాణంలో ఉన్న ఓలా తయారీ కేంద్రం ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ నిర్వహణను పూర్తిగా మహిళలకే అప్పగించనున్నట్లు సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ వెల్లడించారు...
ఇంటర్నెట్ డెస్క్: క్యాబ్ సేవల్లో తనదైన ముద్ర వేసిన ఓలా.. భవిష్యత్తు స్వచ్ఛ ఇంధన వాహన విపణిని ఒడిసిపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. మరోవైపు తమిళనాడులో ‘ఓలాఫ్యూచర్ ఫ్యాక్టరీ’ పేరిట అతిపెద్ద తయారీ యూనిట్ను నిర్మిస్తోంది. 500 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు దిచక్ర వాహన తయరీ కేంద్రంగా చెబుతున్నారు. సెకనుకు రెండు ఈ-స్కూటర్లను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భారత్తో పాటు ప్రపంచ విపణిని ఒడిసిపట్టాలని పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు.
అయితే, ఇంతటి గురుతర బాధ్యతను మహిళలకే అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. ఓలాఫ్యూచర్ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నిర్వహిస్తారని తెలిపారు. దాదాపు 10 వేల మందికి పైగా మహిళలు ఇందులో ఉంటారని వెల్లడించారు. ఈ మేరకు ఇటీవల నియమించుకున్న తొలి విడత మహిళా ఉద్యోగులను భవీష్ ఫ్యాక్టరీలోకి స్వాగతించారు.
ప్రపంచంలో మహిళలు మాత్రమే నిర్వహిస్తున్న అతిపెద్ద ఫ్యాక్టరీ ఓలా ఫ్యూచరేనని భవీష్ తెలిపారు. అలాగే స్త్రీలు మాత్రమే పనిచేస్తున్న ఏకైక వాహన తయారీ కేంద్రం ఇదేనని పేర్కొన్నారు. మహిళలకు ఓలాలో పెద్దపీట వేయనున్నామన్నారు. అందులో భాగంగా తీసుకున్న తొలి నిర్ణయం ఇదేనన్నారు. ‘స్వయం సమృద్ధ భారత్లో స్వయంసమృద్ధ మహిళలు కూడా ఉండాల్సిన అవసరం ఉందన్నా’రు.
ఓలాఫ్యూచర్ ఫ్యాక్టరీలో ప్రతి వాహనం మహిళల చేతుల్లోనే తయారవుతుందని భవీష్ తెలిపారు. అందుకు కావాల్సిన శిక్షణనిచ్చామన్నారు. ఉత్పత్తి రంగంలో మహిళల పాత్ర ఇప్పటి వరకు 12 శాతానికి మాత్రమే పరిమితమైందన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా అవకాశాలు కల్పిస్తే భారత జీడీపీ 27 శాతం ఎగబాకుతుందని పలు అధ్యయనాలు వెల్లడించినట్లు గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు