మోల్నుపిరవిర్ తయారీకి సిద్ధం: ఆప్టిమస్ ఫార్మా
స్వల్ప, మధ్య స్థాయి కొవిడ్-19 లక్షణాలతో బాధపడుతున్న వారిపై నిర్వహించిన మోల్నుపిరవిర్ మూడో దశ క్లినికల్
ఈనాడు, హైదరాబాద్: స్వల్ప, మధ్య స్థాయి కొవిడ్-19 లక్షణాలతో బాధపడుతున్న వారిపై నిర్వహించిన మోల్నుపిరవిర్ మూడో దశ క్లినికల్ పరీక్షల్లో ఆశాజనక ఫలితాలు వచ్చినట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిమస్ ఫార్మా వెల్లడించింది. మోల్నుపిరవిర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థం (ఏపీఐ) ఉత్పత్తికి సంబంధించిన సూత్రీకరణనూ అభివృద్ధి చేస్తున్నట్లు ఆప్టిమస్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి బుధవారం వెల్లడించారు. మొత్తం 1218 మందిపై క్లినికల్ పరీక్షలు నిర్వహించామని, 353 మందిపై నిర్వహించిన ప్రయోగాలకు సంబంధించిన మధ్యంతర ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. చికిత్స 5-28 రోజుల వరకు ఉంటుందని తెలిపారు. 10, 14 రోజు నాటికి ఈ ఔషధం మంచి పనితీరును చూపించడంతోపాటు, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో నెగిటివ్ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. చికిత్స వ్యవధిలో, తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు, అనారోగ్యం బారిన పడకుండా ఈ ఔషధం భద్రతనిస్తుందని తెలిపారు. అందువల్ల ఆప్టిమస్ ఫార్మా మోల్నుపిరవిర్ ఉత్పత్తికి సిద్ధం అవుతోందని వెల్లడించారు. అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐని సంప్రదించినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం