అత్యవసర నిధి కోసం పెట్టుబడి మార్గాలు
నిపుణుల ప్రకారం 10-15 రోజులఖర్చులకు అవసరమైన డబ్బును ఇంటి వద్ద ఉంచుకోవాలి....
అవసరమైన సమయానికి కావలసిన డబ్బు విషయంలో , మదుపరులు చాలా జాగ్రత్తగా ఉండాలి . ఎంతోకాలంగా సస్పెన్షన్ లో ఉన్న ముంబయి ఆధారిత సీకేపీ కో-ఓపెరేటివ్ బ్యాంకు లైసెన్స్ ను ఏప్రిల్ 30న రిజర్వు బ్యాంకు అఫ్ఇండియా రద్దు చేసింది . అయితే 99.2శాతం డిపాజిటర్ ల సొమ్ము డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద వారికి లభిస్తుందని రిజర్వు బ్యాంకు తెలిపింది . పంజాబ్ మహారాష్ట్ర కో-ఓపెరేటివ్ బ్యాంకు (పీఎంసీ) ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉంది .
ఖాతాదారులు ఎస్ బ్యాంకు లో డబ్బులు నెల రోజులు వాడుకోలోలేకపోయారు . ఈ మధ్య ఫ్రాంక్లిన్ టెంపుల్టెన్ మ్యూచువల్ ఫండ్ తన ఆరు డెట్ స్కీం లను సస్పెన్షన్ లో ఉంచింది. దీనివల్ల మదుపరులు తమ సొమ్ము తీసుకోలేరు, మదుపు చేయలేరు. డబ్బు భద్రత ఉందికానీ, ఎప్పుడు చేతికొస్తుందో తెలియని పరిస్థితి . అత్యవసరంగా కావలసిన డబ్బు కోసం ఇటువంటి సమయాల్లో ఏమి చేయాలి . డబ్బును పెట్టుబడి చేసేటప్పుడు అధిక వడ్డీ, పన్ను మినహాయింపులు వంటి వాటికోసం చూడకూడదు . అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేదా ఉద్యోగం కోల్పోయినప్పుడు వంటి సమయాల్లో డబ్బు అవసరం ఉంటుంది.
నిపుణుల ప్రకారం 10-15 రోజులఖర్చులకు అవసరమైన డబ్బును ఇంటి వద్ద ఉంచుకోవాలి . ముంబయి వరదల సమయంలో బ్యాంకులు , ఏటీఎం లు కూడా మూతపడ్డాయి . కొంత డబ్బును పొదుపు ఖాతా లో ఉంచాలి. అయితే పొదుపు ఖాతాలో వుంటే రోజువారీ ఖర్చులకు వాడే అవకాశం ఉంది కాబట్టి, ఫ్లెక్సీ ఫిక్సెడ్ డిపాజిట్ లో వుంచడం వలన , కొంచెం అధిక వడ్డీ తో పాటు , అవసరమైనప్పుడు పొదుపు ఖాతా ద్వారా తిరిగి పొందొచ్చు . అత్యవసర నిధిని దాచుకునేటప్పుడు కో-ఓపెరేటివ్ బ్యాంకుల కన్నా ప్రభుత్వ లేదా పెద్ద ప్రైవేట్ బ్యాంకులను ఎంచుకోవాలి . అలాగే రెండు బ్యాంకు లలో ఉంచడం మంచిది.
అత్యవసర నిధిని మంచి రాబడి, పన్ను మినహాయింపుల కోసం షార్ట్ టర్మ్ ఫండ్స్ లో పెట్టుబడి చేయమని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తూంటారు . అయితే ఈ మధ్య జరిగిన ఫ్రాంక్లిన్ టెంపుల్టెన్ మ్యూచువల్ ఫండ్ ఉదంతం అందరిని ఇబ్బందికి గురి చేసింది . నిపుణుల అభిప్రాయం ప్రకారం అత్యవసర నిధికి అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనం లిక్విడ్/ ఓవర్ నైట్ ఫండ్స్ . లిక్విడ్ ఫండ్స్ ఎంచుకునేటప్పుడు అధిక శాతం ప్రభుత్వ బాండ్స్ , లేదా ‘AAA’ రేటెడ్ బాండ్స్ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే అధిక ఆస్తుల నిర్వహణ (ఏయూఎం) కలిగిన రెండు ఫండ్స్ లో పెట్టుబడి చేయాలి .
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?