Petrol Diesel Price Hike: అక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ.118

రెండు రోజుల విరామం తర్వాత దేశంలో ఇంధన ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బుధవారం (20-10-2021) లీటర్‌ పెట్రోలు, డీజిల్‌పై గరిష్ఠంగా 35 పైసల చొప్పున ఎగబాకింది....

Updated : 17 Oct 2022 14:33 IST

దిల్లీ: రెండు రోజుల విరామం తర్వాత దేశంలో ఇంధన ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బుధవారం (20-10-2021) లీటర్‌ పెట్రోలు, డీజిల్‌పై గరిష్ఠంగా 35 పైసల చొప్పున ఎగబాకింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.19,  డీజిల్‌ రూ.94.92కు చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ ధరలు వరుసగా రూ.112.11, రూ.102.89గా ఉన్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్ర రాజధానుల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటేయగా.. డీజిల్‌ ధర సైతం మెజారిటీ పట్టణాల్లో రూ.100 దాటింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ.118.23గా నమోదైంది. ఇక్కడ డీజిల్‌ ధర రూ.109.04 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 84.53 డాలర్లుగా నమోదవుతోంది. ఇది ఏడేళ్ల గరిష్ఠం కావడం గమనార్హం. సెప్టెంబరు 24 తర్వాత డీజిల్‌ ధర రూ.6.50, పెట్రోల్‌ ధర రూ.5  పెరగడం గమనార్హం.    

నగరం           పెట్రోల్‌(రూ.లలో)        డీజిల్‌(రూ.లలో)

హైదరాబాద్‌           110.46                 103.56

విజయవాడ           112.73                 105.20

విశాఖపట్నం          112.06                 104.55

దిల్లీ                  106.19                 94.57

ముంబయి            112.11                 102.89

చెన్నై                 103.31                 99.26

బెంగళూరు           109.89                 100.75

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని