Petrol Diesel Price Hike : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల గరిష్ఠానికి చేరాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి...
దిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల గరిష్ఠానికి చేరాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. లీటర్ పెట్రోల్పై 20 పైసలు, డీజిల్పై 25 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.39, డీజిల్ రూ.89.57కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ ధరలు వరుసగా రూ.107.47, రూ.97.21గా ఉన్నాయి. గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది తొలిసారి కాగా.. డీజిల్ ధరలు నాలుగోసారి పెరిగింది.
గత ఐదు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వరుసగా పెరుగుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 80 డాలర్లకు చేరువయ్యింది. కరోనా ఆంక్షల నుంచి ప్రపంచం క్రమంగా బయటకు వస్తోంది. దీంతో అన్ని రంగాల్లో సాధారణ కార్యకలాపాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో చమురుకు గిరాకీ పెరిగింది. దీంతో నిల్వలు తగ్గడంతో ఉత్పత్తిని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా ముడి చమురు నిల్వలు మూడేళ్ల కనిష్ఠానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు ఇడా, నికోలస్ తుపానుల వల్ల అమెరికా గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతంలో ఉత్పత్తి దెబ్బతింది. ఇది కూడా ధరలపై ప్రభావం చూపుతోంది.
ప్రధాన నగరాల్లో లీటర్ డీజిల్ పెట్రోల్ ధరలు..
నగరం పెట్రోల్(రూ.లలో) డీజిల్(రూ.లలో)
హైదరాబాద్ 105.48 97.46
విజయవాడ 107.54 99.25
విశాఖపట్నం 106.77 98.51
దిల్లీ 101.39 89.57
ముంబయి 107.47 97.21
చెన్నై 99.15 94.17
బెంగళూరు 104.92 95.06
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.